అవును.. రాజకీయాల్లో నాయకులకు వ్యూహాలు లేకుండా.. ముందు ఆలోచన లేకుండా ఏ పనినీ చేయరు, చేయబోరు. ఇది.. ఇప్పుడు జనసేనలోనూ కనిపిస్తోంది.గత ఎన్నికల్లో జనసేన తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పార్టీ కీలక నాయకుడు నాగబాబు తాజాగా.. సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అన్నారు.
అయితే.. దీనికి ముందు అందరూ కూడా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. ఖచ్చితంగా నరసాపురం టికెట్ను నాగబాబుకు కేటాయిస్తారు.. ఆయన గెలుపు కూడా నల్లేరుపై నడకేనని లెక్కలు వేసుకున్నారు. ఎందుకంటే.. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా.. బలమైన ఓటు బ్యాంకుతో నాగబాబు దూసుకు పోయారు. కానీ, ఇప్పుడు ఆయన ఏకంగా పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.
ఇక, ఈ అనూహ్య పరిణామం వెనుక.. కీలక రీజన్ ఉందని అంటున్నారు పరిశీలకులు. నాగబాబు.. పోటీకి రెడీ అయ్యారని.. అయితే, పొత్తుల నేపథ్యంలో నరసాపురం టికెట్ను టీడీపీనే తన దగ్గర అట్టేపెట్టుకునే వ్యూహం అమలు చేస్తోందని.. ఎందుకంటే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
అంతేకాదు, దీనికి సంబంధించిన డీల్ కూడా ఓకే అయిందని.. అందుకే నాగబాబును అక్కడి నుంచి తప్పించారని అందుకే ఆయన ఎన్నికలకు దూరమవుతున్నట్టు ప్రకటించారని అంటున్నారు. ఇదేసమ యంలో ఆయనకు రాజ్యసభ సీటును కూడా ఖరారు చేశారని.. ఇది కూడా డీల్లో భాగంగానే ఖరారైందని అంటున్నారు. ఏదేమైనా.. నాగబాబు నిర్ణయం వెనుక వైసీపీ రెబల్ నేత కోసం.. చేస్తున్న త్యాగం ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 23, 2023 6:05 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…