అవును.. రాజకీయాల్లో నాయకులకు వ్యూహాలు లేకుండా.. ముందు ఆలోచన లేకుండా ఏ పనినీ చేయరు, చేయబోరు. ఇది.. ఇప్పుడు జనసేనలోనూ కనిపిస్తోంది.గత ఎన్నికల్లో జనసేన తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పార్టీ కీలక నాయకుడు నాగబాబు తాజాగా.. సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అన్నారు.
అయితే.. దీనికి ముందు అందరూ కూడా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. ఖచ్చితంగా నరసాపురం టికెట్ను నాగబాబుకు కేటాయిస్తారు.. ఆయన గెలుపు కూడా నల్లేరుపై నడకేనని లెక్కలు వేసుకున్నారు. ఎందుకంటే.. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా.. బలమైన ఓటు బ్యాంకుతో నాగబాబు దూసుకు పోయారు. కానీ, ఇప్పుడు ఆయన ఏకంగా పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.
ఇక, ఈ అనూహ్య పరిణామం వెనుక.. కీలక రీజన్ ఉందని అంటున్నారు పరిశీలకులు. నాగబాబు.. పోటీకి రెడీ అయ్యారని.. అయితే, పొత్తుల నేపథ్యంలో నరసాపురం టికెట్ను టీడీపీనే తన దగ్గర అట్టేపెట్టుకునే వ్యూహం అమలు చేస్తోందని.. ఎందుకంటే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
అంతేకాదు, దీనికి సంబంధించిన డీల్ కూడా ఓకే అయిందని.. అందుకే నాగబాబును అక్కడి నుంచి తప్పించారని అందుకే ఆయన ఎన్నికలకు దూరమవుతున్నట్టు ప్రకటించారని అంటున్నారు. ఇదేసమ యంలో ఆయనకు రాజ్యసభ సీటును కూడా ఖరారు చేశారని.. ఇది కూడా డీల్లో భాగంగానే ఖరారైందని అంటున్నారు. ఏదేమైనా.. నాగబాబు నిర్ణయం వెనుక వైసీపీ రెబల్ నేత కోసం.. చేస్తున్న త్యాగం ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 23, 2023 6:05 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…