చాలా మంది అన్నదమ్ములు, తల్లీ కుమార్తెలు కూడా రాజకీయం చేస్తున్నారు. అయితే.. అందరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో దామచర్ల జనార్దన్, సత్యలు టీడీపీలోనే ఉన్నారు. శ్రీకాకులంలో ప్రతిభా భారతి, గ్రీష్మలు కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే.. వైసీపీ విషయానికి వస్తే మాత్రం కొంత భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
వైసీపీలో ఉన్న వారిలో ఒకరు టీడీపీలో ఉంటే.. మరొకరు వైసీపీలో ఉన్నారు. దీంతో రాజకీయాలు ఎలా సాగుతాయనేది ప్రశ్న. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోదరుల విషయాన్ని తీసుకుంటే.. బీద మస్తాన్ రావు.. బీఎంఆర్ సంస్థలకు అధినేత. ఈయన సోదరుడు బీద రవిచంద్ర యాదవ్ కూడా ఈ సంస్థకు భాగస్వామి. అయితే.. గత ఎన్నికల వరకు కూడా ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు.
అయితే, గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఓడిపోయిన మస్తాన్ రావు.. ఆవెంటనే వచ్చి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కొన్నాళ్ల కిందట రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేశారు. సరే.. ఇప్పటి వరకు ఎలాగోలా గడిచిపోయిన రాజకీయం.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో మస్తాన్రావును ఇరకాటంలోకి నెట్టిందని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో పార్టీని గెలిపించే బాధ్యతను మస్తాన్రావుకు అప్పగించాలని అధిష్టానం చూస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండడం.. చేతిలో రాజ్యసభ సీటు ఉండడంతో ఆయనకు ప్రత్యక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. మరోవైపు.. రవిచంద్ర ఇప్పటికే జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనకు కూడా టీడీపీ జిల్లాలోని కొన్ని మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత అప్పగించాలని చూస్తోంది.
దీంతో ఇద్దరు అన్నదమ్ములురాజకీయ సుడిలో చిక్కకుకున్నట్టు అయింది. ఇది.. వైసీపీకి నష్టం చేకూరుస్తుందనిపరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీలో ఉన్న మస్తాన్రావు వెంట వైసీపీలో నడిచేందుకు ఆయన అనుచరులు రెడీగా లేకపోవడమే దీనికి కారణం. మరి ఆయన ఏం చేస్తారో.. చూడాలి.
This post was last modified on January 21, 2023 7:53 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…