Political News

మోడీ మోతకే హడలిపోతుంటే.. ఈ బాదుడేంది జగన్?

కోరకుండానే వరాలు ఇచ్చే దేవుళ్లుగా మారుతున్న అధినేతలు.. అదే సమయంలో ప్రజలు వీపులు విమానం మోత మోగేలా బాదేస్తున్న వైరుధ్యం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. సంక్షేమ పథకాల పేరుతో వందలాది కోట్లను వరాలుగా ఇచ్చేస్తున్న వైనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పన్ను బాదుడు బాదేయటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్ఠంగా ఉన్నవేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు తీరుతో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో లీటరు డీజిల్ ధర రూ.80కు చేరుకోవటంలో మోడీ మాష్టారికే క్రెడిట్ ఎక్కువగా ఇవ్వాలి. కరోనా నేపథ్యంలో తగ్గిన రాష్ట్రాల ఆదాయాన్ని పూడ్చుకునేందుకు వీలుగా పెట్రోల్.. డీజిల్ మీద పన్ను భారాన్ని భారీగా పెంచేయటం ఈ మధ్యన చూస్తున్నదే. ఇటీవల అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ మంటలకు ఆజ్యం పోసేలా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యాట్ భారాన్ని మరింత పెంచేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్ పై రూ.1.24.. లీటరు డీజిల్ పై 97 పైసల వ్యాట్ భారాన్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకన్నారు. దీని పుణ్యమా అని లీటరు పెట్రోల్ మీద 31 శాతంగా మారింది. డీజిల్ మీద విధిస్తున్న 22.5 వఆతం వ్యాట్ కు అదనంగా మరింత వ్యాట్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వేళలో రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ మీద పన్నును పెంచుతున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులకు తగ్గట్లే పెట్రోల్.. డీజిల్ మీద పన్నుభారాన్ని పెంచినట్లుగా వెల్లడించింది. తాజాగా పెంచిన పన్ను పోటు పుణ్యమా అని నిత్యవసర వస్తువుల మొదలు అన్నింటి ధరలు పెరగటం ఖాయమంటున్నారు. తాజాగా పెంచిన పన్నుకారణంగా సరకు రవాణా మీద ప్రభావాన్ని చూపనుంది. ఇది..సామాన్య.. మధ్యతరగతి వర్గాలకు ఇబ్బందిగా మారనుంది.

This post was last modified on July 21, 2020 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

1 hour ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

1 hour ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

3 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

4 hours ago