తాజాగా ఖమ్మం వేదికగా.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ నిర్వహించిన ఆవిర్భావ సభ హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే.. ఈ సభావేదికగా.. కేసీఆర్ చేసిన రెండు వ్యాఖ్యలు.. రెండు అంశాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఒకటి విశాఖ ఉక్కు విషయం. రెండు జల వినియోగం. ఈ రెండు కూడా లోకల్ ఇష్యూలే. అయితే.. ఈ రెండు విషయాల్లోనూ… కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మోడీని ఢీకొట్టడం వీరి వల్ల కాదనే భావన వ్యక్తమవుతుండడం గమనార్హం.
ఒకింత చిత్రంగా ఉన్నప్పటికీ.. నిజమే. ఎందుకంటే.. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అడ్డుకునేం దుకు ఇక్కడి ఉద్యోగులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ.. కేంద్రం మాత్రం ముందుకే సాగుతా మని తేల్చి చెబుతోంది. అయితే.. ఈ క్రమంలో ఏపీ తరఫున సీఎం జగన్ ఇలా చేయొద్దంటూ.. లేఖలు సంధించారు.
ఇది ఎలా ఉన్నప్పటికీ.. కేసీఆర్ తాజాగా.. చేసిన ప్రకటన డొల్లేనని తేలిపోయింది. ఎలాగంటే.. ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్మేస్తే అమ్మేయనీయండి.. మేం (బీఆర్ ఎస్) అధికారంలోకి వచ్చాక.. తిరిగి కొంటాం అన్నారు. ఇది ఎంత మేరకు విశ్వసంచాల్సిన అంశం అనేది గమనార్హం. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి దొంగ తనం జరగకుండా కాపాడుకోవాలి. అంతేకానీ.. తాళాలు ఇచ్చేసి మీరు దొంగతనం చేసుకోండి.. తర్వాత రికవరీ చేసుకుంటాం అంటే బాగుంటుందా?
ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు కూడా ఇలానే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ కరణ చేయకుండా అడ్డుకునేందుకు ఒక్క ప్రయత్నం చేయని కేసీఆర్.. తర్వాత కొంటానని చెబుతున్నారు. అంటే.. మోడీని ఇప్పుడు నిలువరించే శక్తి లేదని స్ఫష్టమవుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, దేశంలో 70 శాతం నీటి వనరులు అందుబాటులో ఉంటే 20 శాతం వృథా అవుతోందని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే.. మొత్తం వినియోగంలోకి తెస్తామన్నారు. కానీ.. ఏపీ తెలంగాణ ల మధ్యే జలవనరుల విషయంలో సర్దుబాటు లేనప్పుడు.. దేశం మొత్తాన్ని ఎలా గాడిలో పెడతారో.. కేసీఆర్ చెప్పాలి. ఏదేమైనా.. మోడీని అడ్డుకోవాలన్న తాపత్రయం ఉన్నప్పటికీ ధైర్యం కనిపించడం లేదని.. మేధావి వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on January 19, 2023 2:16 pm
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…