Political News

ఏంటీ… హైదరాబాదులో కేసులు తగ్గాయా?!

రోటీన్ కు భిన్నమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులిటెన్ లో చోటు చేసుకుంది. కోవిడ్ 19 కేసులు నమోదవుతున్న వేళ నుంచి ఇప్పటివరకూ నాలుగైదు రోజుల మినహా.. మిగిలిన రోజులన్ని హెల్త్ బులిటెన్ ను ఎప్పుడు విడుదల చేస్తారో తెలీని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అయితే రాత్రి.. పదకొండు గంటల సమయంలోనూ రిలీజ్ చేసిన పరిస్థితి. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం రాత్రి ఎనిమిది గంటల సమయానికే విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… హైదరాబాదులో కేసుల సంఖ్య పడిపోయింది.

ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 1198 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 46,274 గా తేలితే.. ఈ రోజు మరణాలు ఏడుగా పేర్కొన్నారు. దీంతో.. ఇప్పటివరకూ మరణించిన వారు 422గా చేరింది.

రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 11,530గా పేర్కొన్నారు. దీంతో.. నెగిటివ్ కేసులతో పోలిస్తే.. పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గినట్లైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జీహెచ్ ఎంసీలో కేవలం 510 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 106 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ లో 87.. మేడ్చల్ లో 76 కేసులు నమోదు కాగా.. వరంగల్ లో 73 కేసులు నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాలకు నాలుగు జిల్లాల మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావటం గమనార్హం. అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి 1, వరంగల్ రూరల్ 1, నిర్మల్ 1, సిద్దిపేట 3, మంచిర్యాల 3, ఖమ్మం 3, గద్వాల 3, అసిఫాబాద్ 4 కేసులు నమోదయ్యాయి.

ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్ పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అందులోని తప్పుల మీదా ఫైర్ అయ్యింది. ఇలాంటి సందర్భాల్లో రోజు కంటే ముందే విడుదల చేసిన బులిటెన్ లో మరో ఆసక్తికర అంశం.. హైదరాబాద్ మహానగరంలో చాలా తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావటం.

This post was last modified on July 21, 2020 7:45 am

Share
Show comments
Published by
suman

Recent Posts

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

3 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

4 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

5 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

7 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

8 hours ago