రోటీన్ కు భిన్నమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులిటెన్ లో చోటు చేసుకుంది. కోవిడ్ 19 కేసులు నమోదవుతున్న వేళ నుంచి ఇప్పటివరకూ నాలుగైదు రోజుల మినహా.. మిగిలిన రోజులన్ని హెల్త్ బులిటెన్ ను ఎప్పుడు విడుదల చేస్తారో తెలీని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అయితే రాత్రి.. పదకొండు గంటల సమయంలోనూ రిలీజ్ చేసిన పరిస్థితి. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం రాత్రి ఎనిమిది గంటల సమయానికే విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… హైదరాబాదులో కేసుల సంఖ్య పడిపోయింది.
ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 1198 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 46,274 గా తేలితే.. ఈ రోజు మరణాలు ఏడుగా పేర్కొన్నారు. దీంతో.. ఇప్పటివరకూ మరణించిన వారు 422గా చేరింది.
రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 11,530గా పేర్కొన్నారు. దీంతో.. నెగిటివ్ కేసులతో పోలిస్తే.. పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గినట్లైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జీహెచ్ ఎంసీలో కేవలం 510 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 106 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ లో 87.. మేడ్చల్ లో 76 కేసులు నమోదు కాగా.. వరంగల్ లో 73 కేసులు నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాలకు నాలుగు జిల్లాల మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావటం గమనార్హం. అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి 1, వరంగల్ రూరల్ 1, నిర్మల్ 1, సిద్దిపేట 3, మంచిర్యాల 3, ఖమ్మం 3, గద్వాల 3, అసిఫాబాద్ 4 కేసులు నమోదయ్యాయి.
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్ పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అందులోని తప్పుల మీదా ఫైర్ అయ్యింది. ఇలాంటి సందర్భాల్లో రోజు కంటే ముందే విడుదల చేసిన బులిటెన్ లో మరో ఆసక్తికర అంశం.. హైదరాబాద్ మహానగరంలో చాలా తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావటం.
This post was last modified on July 21, 2020 7:45 am
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…