రోటీన్ కు భిన్నమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులిటెన్ లో చోటు చేసుకుంది. కోవిడ్ 19 కేసులు నమోదవుతున్న వేళ నుంచి ఇప్పటివరకూ నాలుగైదు రోజుల మినహా.. మిగిలిన రోజులన్ని హెల్త్ బులిటెన్ ను ఎప్పుడు విడుదల చేస్తారో తెలీని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అయితే రాత్రి.. పదకొండు గంటల సమయంలోనూ రిలీజ్ చేసిన పరిస్థితి. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం రాత్రి ఎనిమిది గంటల సమయానికే విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… హైదరాబాదులో కేసుల సంఖ్య పడిపోయింది.
ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 1198 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 46,274 గా తేలితే.. ఈ రోజు మరణాలు ఏడుగా పేర్కొన్నారు. దీంతో.. ఇప్పటివరకూ మరణించిన వారు 422గా చేరింది.
రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 11,530గా పేర్కొన్నారు. దీంతో.. నెగిటివ్ కేసులతో పోలిస్తే.. పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గినట్లైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జీహెచ్ ఎంసీలో కేవలం 510 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 106 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ లో 87.. మేడ్చల్ లో 76 కేసులు నమోదు కాగా.. వరంగల్ లో 73 కేసులు నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాలకు నాలుగు జిల్లాల మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావటం గమనార్హం. అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి 1, వరంగల్ రూరల్ 1, నిర్మల్ 1, సిద్దిపేట 3, మంచిర్యాల 3, ఖమ్మం 3, గద్వాల 3, అసిఫాబాద్ 4 కేసులు నమోదయ్యాయి.
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్ పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అందులోని తప్పుల మీదా ఫైర్ అయ్యింది. ఇలాంటి సందర్భాల్లో రోజు కంటే ముందే విడుదల చేసిన బులిటెన్ లో మరో ఆసక్తికర అంశం.. హైదరాబాద్ మహానగరంలో చాలా తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావటం.
This post was last modified on July 21, 2020 7:45 am
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…