Political News

వివేకాను ఎవ‌రు చంపారో.. జ‌గ‌న్‌కు తెలుసు: మాజీ మంత్రి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం తాను వైసీపీలో ఉన్నాన‌ని చెప్పుకొంటున్న డీఎల్ ర‌వీంద్రారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. వైఎస్ వివేకానంద‌రెడ్డిని దారుణంగా హ‌త్య చేసిన వారు ఎవ‌రో.. సీఎం జ‌గ‌న్‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంపింది ఎవ‌రో చెప్పి.. జ‌గ‌న్ త‌న నిజాయితీని నిరూపించుకోవాల‌ని స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. కుటుంబ పెద్ద‌ను, తండ్రిత‌ర్వాత తండ్రిఅంత‌టి వాడిని దారుణంగా చంపిన వారుజ‌గ‌న్ చుట్టూనే తిరుగుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

వివేకానందరెడ్డిని ఎవరో చంపారో సీఎం జగన్‌కు తెలుసు అని డీఎల్‌ రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా అన్ని విషయాలు చెబితే మంచిపేరు వస్తుందని, వివేకా వెంట ఉంటూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుట్రలు చేశారని డీఎల్‌ ఆరోపించారు. ఆ త‌ర్వాత ఎంపీ సీటు కోసం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో దేవిరెడ్డికి, వివేకానంద‌రెడ్డికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం.. ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి కూడా వెల్ల‌డించార‌ని అన్నారు.

ఇంత కీల‌క‌మైన విష‌యంలో సీఎం జ‌గ‌న్ అస‌లు త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. త‌న చుట్టూనే హంత‌కుల‌ను తిప్పుకోవ‌డం వంటివి ప్ర‌జ‌ల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయో గుర్తించాల‌న్నారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ కూడా అప్రూవ‌ర్‌గా మారాల‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, ఏపీలో వైసీపీ పాల‌న అవినీతి కంపు కొడుతోంద‌ని డీఎల్ ఆరోపించారు. వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగిపోయారని, జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని రవీంద్రారెడ్డి అన్నారు. ప్ర‌జ‌లు కూడా ఆలోచిస్తున్నార‌ని.. అందుకే టీడీపీ స‌భ‌లు హిట్ అవుతున్నాయ‌ని చెప్పారు.

This post was last modified on January 7, 2023 8:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

9 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

3 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

4 hours ago