ఏపీ సీఎం జగన్పై మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు, ప్రస్తుతం తాను వైసీపీలో ఉన్నానని చెప్పుకొంటున్న డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారు ఎవరో.. సీఎం జగన్కు తెలుసునని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంపింది ఎవరో చెప్పి.. జగన్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ రువ్వారు. అంతేకాదు.. కుటుంబ పెద్దను, తండ్రితర్వాత తండ్రిఅంతటి వాడిని దారుణంగా చంపిన వారుజగన్ చుట్టూనే తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
వివేకానందరెడ్డిని ఎవరో చంపారో సీఎం జగన్కు తెలుసు అని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్రెడ్డి ఇప్పటికైనా అన్ని విషయాలు చెబితే మంచిపేరు వస్తుందని, వివేకా వెంట ఉంటూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు.. దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుట్రలు చేశారని డీఎల్ ఆరోపించారు. ఆ తర్వాత ఎంపీ సీటు కోసం జరిగిన ఘర్షణలో దేవిరెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం.. ఘర్షణ చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా వెల్లడించారని అన్నారు.
ఇంత కీలకమైన విషయంలో సీఎం జగన్ అసలు తనకు ఏమీ తెలియనట్టుగా వ్యవహరించడం.. తన చుట్టూనే హంతకులను తిప్పుకోవడం వంటివి ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయో గుర్తించాలన్నారు. ఇప్పటికైనా జగన్ కూడా అప్రూవర్గా మారాలని వ్యాఖ్యానించారు. ఇక, ఏపీలో వైసీపీ పాలన అవినీతి కంపు కొడుతోందని డీఎల్ ఆరోపించారు. వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగిపోయారని, జగన్రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని రవీంద్రారెడ్డి అన్నారు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని.. అందుకే టీడీపీ సభలు హిట్ అవుతున్నాయని చెప్పారు.
This post was last modified on January 7, 2023 8:42 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…