ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూస్తే ఇంతకాలం వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ పేరు చేబితేనే జనంలో వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం సభలు వెలవెలబోతుంటే.. టీడీపీ నిర్వహించే సభలు మాత్రం ఫుల్లుగా కనిపిస్తున్నాయి. దానితో అధికార పార్టీ నేతల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలో వైసీపీకి రెండు ఎంపీ సీట్లు, 14 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. మూడు రోజులపాటు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం నుంచి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఆ కార్యక్రమానికి భారీగా జనం తరలి వచ్చారు. దానితో ఓర్వలేక కొందరు వైసీపీ వాళ్లు.. లాయర్లను రెచ్చగొట్టి ధర్నా చేయించారు. ఇదేమీ ఖమ్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం కూడా కర్నూలు జిల్లాలో నిర్వహిస్తారని చెబుతున్నారు…
కోట్ల నాయకత్వమే అడ్వాంటేజ్
కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అత్యంత శక్తిమతుండిగానూ, కీలకంగానూ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వేదవతి ప్రాజక్టు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ.. పాదయాత్ర చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి నుంచి గూల్యం వరకూ దాదాపు 12 కిలోమీటర్ల పాదయాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది కోట్ల దంపతుల పాదయాత్రలో టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అమర్నాథ్రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్లు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా రావడంతో టీడీపీకి ఎక్కడ లేని బలం వచ్చింది…
సూర్య ప్రకాశ్ పైనే అధిష్టానానికి గురి
వచ్చే ఎన్నికల నాటికి సూర్య ప్రకాశ్ రెడ్డికి ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లా పార్టీలో ఆమె పట్ల వ్యతిరేకత పెరుగుతోందట. ఈ సారి టికెటివ్వడం కూడా అనుమానమేనని అంటున్నారు. జిల్లాలోని ఇతర నేతలు కూడా వైసీపీతో పోరాడేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కుమారుడైన సూర్యప్రకాశ్ మాత్రం వైసీపీని ధైర్యంగా ఎదుర్కునే ఛాన్సుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఆ సంగతి గ్రహంచిన సూరీడు కూడా తన అనుచరులను అలెర్ట్ చేశారట. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని క్రీయాశీలంగా మార్చివేసి, చంద్రబాబు దృష్టిని ఆకర్షించాలని తమ వర్గం కార్యకర్తలను ఆయన ఆదేశించారు.
This post was last modified on December 27, 2022 12:13 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…