ఏపీలో వచ్చే 2024లో జరగనున్న ఎన్నికల్లోనే అధికారంలో వచ్చేస్తామని జనసేన చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి విరుద్ధంగా.. పార్టీలో అంతర్గత చర్చ ఒకటి జరుగుతోంది. ఇప్పటికి ప్పుడు అధికారం రాకున్నా రాకపోయినా.. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని.. ఇప్పటి నుంచి పునాదులు బలంగా వేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు నాయకులు గుసగుసలాడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జనసేనను పోటీకి పెట్టేందుకు అభ్యర్థులు లేరు. సో.. ఇప్పుడు టీడీపీతో జతకట్టినా.. 40 లోపు స్థానాలు మాత్రమే దక్కుతాయి. వీటిలో బలమైన స్థానాలను ఎంచుకుని.. ఐదు నుంచి ఆరు జిల్లాలను టార్గెట్ చేసుకుని.. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. ఇవి శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, గుంటూరు.. కర్నూలు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలుగా ఉన్నట్టు లెక్కులువేస్తున్నారు.
ఆయా జిల్లాల్లో ముందు పునాదులు బలంగా వేసుకుని వచ్చే 2029 టార్గెట్గా శ్రీకారం చుట్టనున్నట్టు పెద్ద ఎత్తున నాయకులు చెబుతున్నారు. కనీసం 25-30 మందిని గెలిపించుకుంటే.. చాలు రాష్ట్రం లో 2029 నాటికిబలమైనశక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పవన్ ఆలోచన చేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. వారి ద్వారా ప్రజల మనసుల్లో పాగా వేయాలనేది వీరి వ్యూహంగా ఉందని అంటున్నారు.
తాము పెట్టుకున్న లక్ష్యంలో ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు సీట్లుతగ్గినా.. మిగిలిన సీట్లను గెలుచుకుని ..అసెంబ్లీలో గట్టి వాయిస్ వినిపించడంతోపాటు.. 2029 నాటికి బలహీనమయ్య పార్టీని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చని.. అంటున్నారు. ఇప్పటికిప్పుడు మాత్రం ఖచ్చితంగా 25నుంచి 30 సీట్ల లో గెలుపు ఖాయం దిశగా ప్రచారం ఉంటుందని చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on December 23, 2022 3:52 pm
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…