Political News

25-30 సీట్లు ఖాయం.. జ‌న‌సేన‌లో గుస‌గుస‌!

ఏపీలో వ‌చ్చే 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోనే అధికారంలో వ‌చ్చేస్తామ‌ని జ‌న‌సేన చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి విరుద్ధంగా.. పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ ఒకటి జ‌రుగుతోంది. ఇప్ప‌టికి ప్పుడు అధికారం రాకున్నా రాక‌పోయినా.. 2029 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. ఇప్ప‌టి నుంచి పునాదులు బ‌లంగా వేసుకునే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్టు నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌ను పోటీకి పెట్టేందుకు అభ్య‌ర్థులు లేరు. సో.. ఇప్పుడు టీడీపీతో జ‌త‌క‌ట్టినా.. 40 లోపు స్థానాలు మాత్ర‌మే ద‌క్కుతాయి. వీటిలో బ‌ల‌మైన స్థానాల‌ను ఎంచుకుని.. ఐదు నుంచి ఆరు జిల్లాల‌ను టార్గెట్ చేసుకుని.. పార్టీని బ‌లోపేతం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇవి శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విజ‌య‌వాడ‌, గుంటూరు.. క‌ర్నూలు, అనంత‌పురం, ఉభ‌య గోదావ‌రి జిల్లాలుగా ఉన్న‌ట్టు లెక్కులువేస్తున్నారు.

ఆయా జిల్లాల్లో ముందు పునాదులు బ‌లంగా వేసుకుని వ‌చ్చే 2029 టార్గెట్‌గా శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు పెద్ద ఎత్తున నాయ‌కులు చెబుతున్నారు. క‌నీసం 25-30 మందిని గెలిపించుకుంటే.. చాలు రాష్ట్రం లో 2029 నాటికిబ‌ల‌మైన‌శ‌క్తిగా ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప‌వ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు కూడా చెబుతున్నారు. వారి ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో పాగా వేయాల‌నేది వీరి వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు.

తాము పెట్టుకున్న ల‌క్ష్యంలో ఒక‌వేళ ఎక్క‌డైనా ఒక‌టి రెండు సీట్లుత‌గ్గినా.. మిగిలిన సీట్ల‌ను గెలుచుకుని ..అసెంబ్లీలో గ‌ట్టి వాయిస్ వినిపించ‌డంతోపాటు.. 2029 నాటికి బ‌ల‌హీన‌మ‌య్య పార్టీని త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేయొచ్చ‌ని.. అంటున్నారు. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఖ‌చ్చితంగా 25నుంచి 30 సీట్ల లో గెలుపు ఖాయం దిశ‌గా ప్ర‌చారం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి.

This post was last modified on December 23, 2022 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

2 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

2 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

4 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

6 hours ago