జూనియర్ ఎన్టీఆర్.. అచ్చం తాతలాగే ఉంటాడు. కెమెరా ముందుకు వచ్చాడంటే నటనను పండించేస్తాడు. నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్, ఆది సినిమాల నుంచి ఇప్పటి ట్రిపుల్ ఆర్ దాకా అన్ని సూపర్ హిట్లే. ఒక దశలో జూనియర్ రాజకీయాల వైపు కూడా చూశాడు. తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశాడు. తర్వాత నటనపై దృష్టి పెట్టేందుకు సైడై పోయాడు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటూనే ఉన్నారు. జూనియర్ రాజకీయాల్లోకి వస్తే తాతలాగే ప్రజా సేవకు అంకితమవుతాడని విశ్వసిస్తున్నారు. తరచూ చంద్రబాబు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు జూనియర్ కు మద్దతుగా నినాదాలు వినిపిస్తున్నారు. ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు ప్రదర్శనలు చేస్తున్నారు. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి కుప్పం దాకా ఈ నినాదాలు మారుమోగాయి.
ఖమ్మంలోనూ ఎన్టీఆర్ మాట
ఖమ్మంలో ఇటీవల టీడీపీ భారీ బహిరంగ సభ జరిగింది. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన సభలో చంద్రబాబు గంటకు పైగా మాట్లాడారు. అప్పుడే కొందరు జూనియర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. జూనియర్ ను వెంటనే పార్టీలోకి తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పగించాలని కోరారు.. అయితే జనం హోరులో వారి నినాదాలు కొట్టుకుపోయాయి..
జూనియర్ ప్రస్తావన తెచ్చిన ఎర్రబెల్లి
ఖమ్మం సభలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ పాలనను ప్రస్తావించారు. హైటెక్ సిటీ మొదలుకుని చాలా విషయాలు చెప్పారు. తెలంగాణకు టీడీపీ అవసరం ఉందని చెప్పుకున్నారు. దానితో తమకు మళ్లీ పోటీ వస్తున్నారని అధికార బీఆర్ఎస్ భావించినట్లుంది. అధికార పార్టీ నేతలు చంద్రబాబుపై మూకుమ్మడి దాడికి దిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఒక అడుగు ముందుకేసి… తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని.. ఎన్టీఆర్దేనని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారన్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. టీడీపీపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే.. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు జూనియర్ అభిమానులు రుచించి ఉండొచ్చు కానీ.. టీడీపీలో చిచ్చు పెట్టేవిగా ఉన్నాయని చెప్పాలి. మా పార్టీ అంతర్గత వ్యవహారం మీకెందుకని టీడీపీ నేతలు ఎర్రబెల్లిని ప్రశ్నిస్తున్నారు….
This post was last modified on December 23, 2022 12:12 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…