Political News

కేంద్ర‌ బ‌డ్జెట్ లెక్క‌లు.. ఈ ‘సారీ’ ఏపీకి సారీనే…!

కేంద్ర బ‌డ్జెట్ కూర్పు దాదాపు అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. 2023-24 వార్షిక‌బ‌డ్జెట్ కు సంబంధించిన వంట‌కాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌తోనూ చ‌ర్చించి పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో ఏపీకి కూడా ఎంత ఇవ్వాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి నివేదిక‌లు పంపించేశారు.

అయితే.. ప్ర‌స్తుతం ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు.. కేంద్ర బ‌డ్జెట్‌లో మ‌ళ్లీ రాజ‌ధాని ఊసు క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ ఏడాది ప్ర‌స్తుత వార్షిక బ‌డ్జెట్ 2022-23లోనూ రాజ‌ధాని అమరావ‌తి ఊసు మ‌న‌కు క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో విశాఖ రైల్వేజోన్‌కు కూడానిధులు కేటాయించలేదు. కీల‌క‌మైన న‌ర‌సాపురం.. హైద‌రాబాద్‌.. డుబుల్‌ లైన్ ప‌నులు.. విశాఖ మెట్రో.. విజ‌య‌వాడ మెట్రో వంటివి కూడా గ‌త బ‌డ్జెట్‌లో ఇవ్వ‌లేదు.

దీంతో వ‌చ్చే 2023-24 బ‌డ్జెట్‌లో అయినా.. అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ప్ర‌తిపాద‌న‌లు అందిన‌ట్టు ఎక్క‌డా స‌మాచారం రావ‌డం లేదు. అంతేకాదు.. భోగాపురం విమానాశ్ర‌యం ప‌నులు మాత్రం వ‌చ్చే బ‌డ్జెట్‌లో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వెనుక‌బ‌డిన ప్రాంతాలు.. పోల‌వ‌రం ప్ర‌త్యేక నిధులు వంటివి కూడా బ‌డ్జెట్‌లో క‌నిపించే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.

అంటే.. మొత్తంగా చూస్తే.. ఏపీ ఏం చెప్పిందో ఇత‌మిత్థంగా తెలియ‌క‌పోయినా..కీల‌క‌మైన రాజ‌ధాని, పోల‌వ‌రం, వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధులు వంటి విష‌యంలో ఈ సారికూడా కేంద్రం బ‌డ్జెట్‌లో ఏపీ ప్రస్తావ‌న‌ను తెచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. అదేవిధంగా కేటాయింపుల్లోనూ ఈ సారి భారీ కోత పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి గ‌త ఏడాది బ‌డ్జెట్ కంటే కూడా వ‌చ్చే బ‌డ్జెట్‌లో కేంద్రం ఏపీకి చేసేది ఏమీ క‌నిపించ‌డం లేద‌ని డిల్లీ వ‌ర్గాలు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 23, 2022 10:54 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

55 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

1 hour ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

2 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

4 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

4 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

4 hours ago