Political News

కేంద్ర‌ బ‌డ్జెట్ లెక్క‌లు.. ఈ ‘సారీ’ ఏపీకి సారీనే…!

కేంద్ర బ‌డ్జెట్ కూర్పు దాదాపు అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. 2023-24 వార్షిక‌బ‌డ్జెట్ కు సంబంధించిన వంట‌కాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌తోనూ చ‌ర్చించి పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో ఏపీకి కూడా ఎంత ఇవ్వాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి నివేదిక‌లు పంపించేశారు.

అయితే.. ప్ర‌స్తుతం ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు.. కేంద్ర బ‌డ్జెట్‌లో మ‌ళ్లీ రాజ‌ధాని ఊసు క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ ఏడాది ప్ర‌స్తుత వార్షిక బ‌డ్జెట్ 2022-23లోనూ రాజ‌ధాని అమరావ‌తి ఊసు మ‌న‌కు క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో విశాఖ రైల్వేజోన్‌కు కూడానిధులు కేటాయించలేదు. కీల‌క‌మైన న‌ర‌సాపురం.. హైద‌రాబాద్‌.. డుబుల్‌ లైన్ ప‌నులు.. విశాఖ మెట్రో.. విజ‌య‌వాడ మెట్రో వంటివి కూడా గ‌త బ‌డ్జెట్‌లో ఇవ్వ‌లేదు.

దీంతో వ‌చ్చే 2023-24 బ‌డ్జెట్‌లో అయినా.. అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ప్ర‌తిపాద‌న‌లు అందిన‌ట్టు ఎక్క‌డా స‌మాచారం రావ‌డం లేదు. అంతేకాదు.. భోగాపురం విమానాశ్ర‌యం ప‌నులు మాత్రం వ‌చ్చే బ‌డ్జెట్‌లో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వెనుక‌బ‌డిన ప్రాంతాలు.. పోల‌వ‌రం ప్ర‌త్యేక నిధులు వంటివి కూడా బ‌డ్జెట్‌లో క‌నిపించే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.

అంటే.. మొత్తంగా చూస్తే.. ఏపీ ఏం చెప్పిందో ఇత‌మిత్థంగా తెలియ‌క‌పోయినా..కీల‌క‌మైన రాజ‌ధాని, పోల‌వ‌రం, వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధులు వంటి విష‌యంలో ఈ సారికూడా కేంద్రం బ‌డ్జెట్‌లో ఏపీ ప్రస్తావ‌న‌ను తెచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. అదేవిధంగా కేటాయింపుల్లోనూ ఈ సారి భారీ కోత పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి గ‌త ఏడాది బ‌డ్జెట్ కంటే కూడా వ‌చ్చే బ‌డ్జెట్‌లో కేంద్రం ఏపీకి చేసేది ఏమీ క‌నిపించ‌డం లేద‌ని డిల్లీ వ‌ర్గాలు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 23, 2022 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

23 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago