తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యే హైదరాబాద్లో తన ప్రోత్సాహంతో ఏర్పాటైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియోల కంటే.. ఆయన గురించి ఐఎస్బీ ప్రతినిధులు, ఆ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ప్రముఖులు చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబు విజన్ గురించి.. ఐఎస్బీకి ఆయన అందించిన ప్రోత్సాహం గురించి వాళ్లు చెబుతుంటే.. చంద్రబాబు అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి.
న్యూట్రల్ జనాలకు కూడా ఆ మాటలు గొప్పగా అనిపించాయి. చంద్రబాబు మీద గౌరవభావం కలిగించాయి. ఒక రెండు రోజుల పాటు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. మనం ఏదైనా మంచి చేస్తే దాని గురించి మనం చెప్పుకోవడం కంటే వేరే వాళ్లు చెబితే వచ్చే ఎలివేషన్ వేరుగా ఉంటుంది అనడానికి ఇది ఉదాహరణ.
ఐతే ఎంతో తెలివైన వ్యక్తిగా, రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు ఇంత చిన్న లాజిక్ అర్థం కాక ఎప్పటికప్పుడు తప్పులో కాలేస్తుంటారు. తన గొప్పను తాను చెప్పుకునే క్రమంలో హద్దులు దాటిపోతుంటారు. మాటలు అటు ఇటు అయి వేరే అర్థం వచ్చేలా మాట్లాడి ప్రత్యర్థులకు దొరికిపోతుంటారు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో దుష్ప్రచారాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అది తెలిసి కూడా తన గొప్పలు తాను చెప్పుకునే క్రమంలో బుక్ అయిపోవడం చంద్రబాబుకు అలవాటు.
ఖమ్మంలో సూపర్ సక్సెస్ అయిన తెలుగుదేశం సభలోనూ ఆయన అలాగే చేశారు. కరోనా వైరస్ కనుగొనడానికి తెలుగుదేశం పార్టీయే కారణం అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. నిజానికి ఆయన ఉద్దేశం ఏంటంటే.. తన ప్రోద్బలంతో ఏర్పాటైన జినోమ్ వ్యాలీ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించిందని, అక్కడ ఏర్పాటైన భారత్ బయోటెక్ సంస్థే కోవాగ్జిన్ తయారు చేసి దేశాన్ని కాపాడింది అని. కానీ సోషల్ మీడియా జనాలకు ఇదంతా ఎందుకు? ‘‘కరోనా వ్యాక్సిన్ రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ’’ అనే పాయింట్ మాత్రం తీసుకుని చంద్రబాబు సెల్ఫ్ డబ్బా అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.
గతంలో దేశంలో సెల్ ఫోన్ విప్లవానికి పరోక్షంగా తనే కారణం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అటు ఇటు మారి సెల్ ఫోన్ కనిపెట్టింది తనే అని చంద్రబాబు అన్నట్లుగా ప్రచారంలోకి వెళ్లాయి. విమర్శలు తప్పలేదు. ఇలా పలుమార్లు తన వ్యాఖ్యలు ట్రోల్స్కు దారి తీస్తున్నా చంద్రబాబులో మార్పు రావడం లేదు. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం తగ్గించడం, అలాగే చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, మరో అర్థం రానివ్వకుండా మాట్లాడడం అవసరం.
This post was last modified on December 22, 2022 11:16 am
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…