బంగారు తెలంగాణ.. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు అప్పుల తెలంగాణ! ఈ మాట అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయని కేంద్రం గణాంకాల సయితంగా వివరించింది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ.లక్షా 60వేల 296.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ.3 లక్షల 12 వేల 191.3 కోట్లకు చేరినట్లు పేర్కొంది.
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్, రంజిత్రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2017-2018లో గతేడాదితో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం పేర్కొంది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్ధికశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వివరించింది.
అయితే, దీనిపై ఎంపీలు తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువస్తున్నామని.. దళిత బంధు, రైతు బంధు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. అందుకే అప్పులు పెరుగుతున్నాయని అన్నారు. అంతేకాదు..కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ సర్కారుపై కోపంతో నిధులు ఇవ్వడం లేదని, అది కూడా ప్రధాన కారణమని వివరించారు. రాష్ట్రంలో విభజన నాటికి.. ఇప్పటికీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, డబుల్బెడ్ రూంల నిర్మాణం వంటివి చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అప్పులు కొత్తకాదని.. గుజరాత్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రమే అప్పుల్లో ఉందని సమర్థించుకున్నారు.
This post was last modified on December 19, 2022 9:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…