మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. . తాజాగా విజయవాడలోని ఓ హోటల్ లో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చసాగుతోంది. వాస్తవానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయకులు. గంటా, బొండా ఇద్దరూ టీడీపీలో ఉన్నారు. కన్నా మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు.
అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. వచ్చే ఎన్నికలు సమీపి స్తున్న నేపథ్యంలో వీరు ఒకే చోట భేటీ కావడం వంటివి ఆసక్తికర చర్చకు దారితీశాయి. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. గత మూడేళ్లుగా మౌనంగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ.. పలు దఫాలుగా చర్చకు వచ్చినా.. ఆయన ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడింది లేదు.
ఇక, కన్నా కూడా బీజేపీలోనే ఉన్నప్పటికీ ఆయన ఇటీవల పార్టీ రాష్ట్ర శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజుపై ఆయన బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన జనసేనతోనూ టచ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్తోనూ ఆయన భేటీ అయ్యారు. పైకి స్తానిక విషయాలు చర్చించుకున్నామనిచెబుతున్నా.. ఆయన అంతరంగం మాత్రం పార్టీ మారాలనే ఉద్దేశంతోనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక, బొండా ఉమా కూడా టీడీపీలో నామ్ కే వాస్తే.,. అన్నట్టుగా మారిపోయారు. తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలవడం.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుకావడం.. ఎన్నికల వేళ చర్చలకు దిగడం వంటివి ప్రాధాన్యం దక్కించుకున్నాయి. వీరు ముగ్గురూ కూడా జనసేనలో కివెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారనేది పరిశీలకుల అంచనా. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్న పవన్ వైపు వీరు మొగ్గే అవకాశం ఉందని.. అందుకే చర్చలకు దిగారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 16, 2022 6:44 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…