Political News

గంటా-క‌న్నా-బొండా.. భేటీ ఎందుకు హాట్ అయిందంటే!

మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. . తాజాగా విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్ లో ర‌హ‌స్యంగా భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్ర రాజ‌కీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. వాస్త‌వానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయ‌కులు. గంటా, బొండా ఇద్ద‌రూ టీడీపీలో ఉన్నారు. క‌న్నా మాత్రం బీజేపీలోనే కొన‌సాగుతున్నారు.

అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌లు స‌మీపి స్తున్న నేప‌థ్యంలో వీరు ఒకే చోట భేటీ కావ‌డం వంటివి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీశాయి. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. గ‌త మూడేళ్లుగా మౌనంగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ.. ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఆయ‌న ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడింది లేదు.

ఇక‌, క‌న్నా కూడా బీజేపీలోనే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర శాఖ‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజుపై ఆయ‌న బాహాటంగానే విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌న‌సేన‌తోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పార్టీ కీల‌క నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. పైకి స్తానిక విష‌యాలు చ‌ర్చించుకున్నామ‌నిచెబుతున్నా.. ఆయ‌న అంత‌రంగం మాత్రం పార్టీ మారాల‌నే ఉద్దేశంతోనే ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇక‌, బొండా ఉమా కూడా టీడీపీలో నామ్ కే వాస్తే.,. అన్న‌ట్టుగా మారిపోయారు. త‌న‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ముగ్గురు క‌ల‌వ‌డం.. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారుకావ‌డం.. ఎన్నిక‌ల వేళ చ‌ర్చ‌ల‌కు దిగ‌డం వంటివి ప్రాధాన్యం ద‌క్కించుకున్నాయి. వీరు ముగ్గురూ కూడా జ‌న‌సేన‌లో కివెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న ప‌వ‌న్ వైపు వీరు మొగ్గే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే చ‌ర్చ‌ల‌కు దిగార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 16, 2022 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

10 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago