Political News

గంటా-క‌న్నా-బొండా.. భేటీ ఎందుకు హాట్ అయిందంటే!

మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. . తాజాగా విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్ లో ర‌హ‌స్యంగా భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్ర రాజ‌కీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. వాస్త‌వానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయ‌కులు. గంటా, బొండా ఇద్ద‌రూ టీడీపీలో ఉన్నారు. క‌న్నా మాత్రం బీజేపీలోనే కొన‌సాగుతున్నారు.

అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌లు స‌మీపి స్తున్న నేప‌థ్యంలో వీరు ఒకే చోట భేటీ కావ‌డం వంటివి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీశాయి. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. గ‌త మూడేళ్లుగా మౌనంగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ.. ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఆయ‌న ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడింది లేదు.

ఇక‌, క‌న్నా కూడా బీజేపీలోనే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర శాఖ‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజుపై ఆయ‌న బాహాటంగానే విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌న‌సేన‌తోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పార్టీ కీల‌క నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. పైకి స్తానిక విష‌యాలు చ‌ర్చించుకున్నామ‌నిచెబుతున్నా.. ఆయ‌న అంత‌రంగం మాత్రం పార్టీ మారాల‌నే ఉద్దేశంతోనే ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇక‌, బొండా ఉమా కూడా టీడీపీలో నామ్ కే వాస్తే.,. అన్న‌ట్టుగా మారిపోయారు. త‌న‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ముగ్గురు క‌ల‌వ‌డం.. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారుకావ‌డం.. ఎన్నిక‌ల వేళ చ‌ర్చ‌ల‌కు దిగ‌డం వంటివి ప్రాధాన్యం ద‌క్కించుకున్నాయి. వీరు ముగ్గురూ కూడా జ‌న‌సేన‌లో కివెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న ప‌వ‌న్ వైపు వీరు మొగ్గే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే చ‌ర్చ‌ల‌కు దిగార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 16, 2022 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago