Political News

గంటా-క‌న్నా-బొండా.. భేటీ ఎందుకు హాట్ అయిందంటే!

మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. . తాజాగా విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్ లో ర‌హ‌స్యంగా భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్ర రాజ‌కీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. వాస్త‌వానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయ‌కులు. గంటా, బొండా ఇద్ద‌రూ టీడీపీలో ఉన్నారు. క‌న్నా మాత్రం బీజేపీలోనే కొన‌సాగుతున్నారు.

అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌లు స‌మీపి స్తున్న నేప‌థ్యంలో వీరు ఒకే చోట భేటీ కావ‌డం వంటివి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీశాయి. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. గ‌త మూడేళ్లుగా మౌనంగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ.. ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఆయ‌న ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడింది లేదు.

ఇక‌, క‌న్నా కూడా బీజేపీలోనే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర శాఖ‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజుపై ఆయ‌న బాహాటంగానే విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌న‌సేన‌తోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పార్టీ కీల‌క నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. పైకి స్తానిక విష‌యాలు చ‌ర్చించుకున్నామ‌నిచెబుతున్నా.. ఆయ‌న అంత‌రంగం మాత్రం పార్టీ మారాల‌నే ఉద్దేశంతోనే ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇక‌, బొండా ఉమా కూడా టీడీపీలో నామ్ కే వాస్తే.,. అన్న‌ట్టుగా మారిపోయారు. త‌న‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ముగ్గురు క‌ల‌వ‌డం.. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారుకావ‌డం.. ఎన్నిక‌ల వేళ చ‌ర్చ‌ల‌కు దిగ‌డం వంటివి ప్రాధాన్యం ద‌క్కించుకున్నాయి. వీరు ముగ్గురూ కూడా జ‌న‌సేన‌లో కివెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న ప‌వ‌న్ వైపు వీరు మొగ్గే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే చ‌ర్చ‌ల‌కు దిగార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 16, 2022 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago