Political News

గంటా-క‌న్నా-బొండా.. భేటీ ఎందుకు హాట్ అయిందంటే!

మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. . తాజాగా విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్ లో ర‌హ‌స్యంగా భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్ర రాజ‌కీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. వాస్త‌వానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయ‌కులు. గంటా, బొండా ఇద్ద‌రూ టీడీపీలో ఉన్నారు. క‌న్నా మాత్రం బీజేపీలోనే కొన‌సాగుతున్నారు.

అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌లు స‌మీపి స్తున్న నేప‌థ్యంలో వీరు ఒకే చోట భేటీ కావ‌డం వంటివి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీశాయి. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. గ‌త మూడేళ్లుగా మౌనంగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ.. ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఆయ‌న ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడింది లేదు.

ఇక‌, క‌న్నా కూడా బీజేపీలోనే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర శాఖ‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజుపై ఆయ‌న బాహాటంగానే విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌న‌సేన‌తోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పార్టీ కీల‌క నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. పైకి స్తానిక విష‌యాలు చ‌ర్చించుకున్నామ‌నిచెబుతున్నా.. ఆయ‌న అంత‌రంగం మాత్రం పార్టీ మారాల‌నే ఉద్దేశంతోనే ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇక‌, బొండా ఉమా కూడా టీడీపీలో నామ్ కే వాస్తే.,. అన్న‌ట్టుగా మారిపోయారు. త‌న‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ముగ్గురు క‌ల‌వ‌డం.. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారుకావ‌డం.. ఎన్నిక‌ల వేళ చ‌ర్చ‌ల‌కు దిగ‌డం వంటివి ప్రాధాన్యం ద‌క్కించుకున్నాయి. వీరు ముగ్గురూ కూడా జ‌న‌సేన‌లో కివెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న ప‌వ‌న్ వైపు వీరు మొగ్గే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే చ‌ర్చ‌ల‌కు దిగార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 16, 2022 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

2 hours ago

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

3 hours ago

బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పు.. ఖాతాదారుడికి వాతలు?

గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…

4 hours ago

ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం

ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…

4 hours ago

తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…

7 hours ago

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…

7 hours ago