నిజమే.. ఎవరు ఒంటరిగా పోటీ చేసినా.. ఏపీలో విజయం దక్కించుకోవడం కష్టం! వైసీపీ అయినా.. జనసేన అయినా.. టీడీపీ అయినా.. అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చే 2024 ఎన్నికలు హాట్ అనే ప్రచారం ఉంది. దీంతో రాజకీయ సమీకరణలు, మార్పులు అత్యంత ఆవశ్యమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానంటూ జనసేన అధినేత పవన్ గత కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జరగాలంటే.. అన్ని పార్టీలు కలిసి తీరాలి. కానీ, పవన్ మాత్రం ఒంటరిపోరుకే రెడీ అంటూ.. ఇటీవల విజయనగరంలోనూ.. మంగళగిరిలోనూ సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని.. జనసేన అధికారంలోకి రాగానే వైసీపీ నేతలను తరిమితరిమి కొడతామని అన్నారు.
కానీ, ఒంటరి పోరుతో సాధ్యం కాదు. ఇక, టీడీపీని తీసుకున్నా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా జిల్లాల్లో పార్టీనేతల మధ్య నెలకొన్న విభేదాలు… పూర్తిస్థాయిలోఒంటరిగా గెలుపు గుర్రం ఎక్కే రేంజ్లో అయితే.. మెజారిటీని అందించలేవు. సో.. పొత్తులు తప్పవు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. పైకి ఒంటరిగా.. పోటీ చేస్తున్నా.. తెరచాటున అటు తెలంగాణ అధికార పార్టీతోనో.. కేంద్రంలోని పెద్దలతోనో.. పోటీ చేయాల్సిందే. అంటే.. మొత్తంగా ఏపీలో ఏ పార్టీ కూడా ఒంటరిగా బరిలో దిగే పరిస్థితి లేదు. ఇలా దిగితే.. ఓటమిని ఆహ్వానించేనట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 11, 2022 3:17 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…