నిజమే.. ఎవరు ఒంటరిగా పోటీ చేసినా.. ఏపీలో విజయం దక్కించుకోవడం కష్టం! వైసీపీ అయినా.. జనసేన అయినా.. టీడీపీ అయినా.. అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చే 2024 ఎన్నికలు హాట్ అనే ప్రచారం ఉంది. దీంతో రాజకీయ సమీకరణలు, మార్పులు అత్యంత ఆవశ్యమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానంటూ జనసేన అధినేత పవన్ గత కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జరగాలంటే.. అన్ని పార్టీలు కలిసి తీరాలి. కానీ, పవన్ మాత్రం ఒంటరిపోరుకే రెడీ అంటూ.. ఇటీవల విజయనగరంలోనూ.. మంగళగిరిలోనూ సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని.. జనసేన అధికారంలోకి రాగానే వైసీపీ నేతలను తరిమితరిమి కొడతామని అన్నారు.
కానీ, ఒంటరి పోరుతో సాధ్యం కాదు. ఇక, టీడీపీని తీసుకున్నా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా జిల్లాల్లో పార్టీనేతల మధ్య నెలకొన్న విభేదాలు… పూర్తిస్థాయిలోఒంటరిగా గెలుపు గుర్రం ఎక్కే రేంజ్లో అయితే.. మెజారిటీని అందించలేవు. సో.. పొత్తులు తప్పవు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. పైకి ఒంటరిగా.. పోటీ చేస్తున్నా.. తెరచాటున అటు తెలంగాణ అధికార పార్టీతోనో.. కేంద్రంలోని పెద్దలతోనో.. పోటీ చేయాల్సిందే. అంటే.. మొత్తంగా ఏపీలో ఏ పార్టీ కూడా ఒంటరిగా బరిలో దిగే పరిస్థితి లేదు. ఇలా దిగితే.. ఓటమిని ఆహ్వానించేనట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 11, 2022 3:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…