తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే..ఈ విజయం దక్కడం ఈ పార్టీకి ఇది దాదాపు 7వ సారి. అంటే.. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుల విజయాన్ని పక్కకు నెట్టి శతాబ్ది విజయాన్ని అందుకున్నట్టు అయింది.
అయితే.. Gujarat లో BJP గెలుపు ఒక్కరోజులోనో.. ఎలాంటి పరిశ్రమా చేయకుండానో దక్కలేదు. అడుగడుగూ.. అణువణువూ గెలవాలన్న పార్టీ నేతల తపన.. కీలక నేతల వ్యూహాలు.. వీటికి మించి.. మోడీ చరిష్మా ఇవన్నీ కూడా.. కలగలిసి.. గుజరాత్ మిఠాయిని బీజేపీకి అందేలా చేశాయి. వాస్తవానికి బలమైన ప్రతిపక్షం అనుకున్న కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేసిన విన్యాసాలు బీజేపీకి బాగా కలిసి వచ్చాయి.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. Gujarat లో అధికారంలో ఉన్నాం కదా.. అనే ధీమాను బీజేపీ వ్యక్తపరచలేదు. ఎక్కడికక్కడ ఎప్పటిక ప్పుడు.. మార్పులు చేసుకుంది. అవసరం అయితే.. సీఎం అంతటి వాడిని పక్కన పెట్టింది. తాజా ఎన్నికలకు ఏడాది ముందుగానే విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గాన్ని బీజేపీ పక్కనపెట్టింది.
అంటే కఠిన నిర్ణయాలు ఎలా ఉంటాయో.. ఇది నిరూపిస్తుంది. ఇక, ఏపీకి వస్తే.. Gujarat ఎన్నిక సారాంశం .. TDP నేతలకు ఒక చక్కని పాఠం వంటింది. ఎందుకంటే..ఇక్కడ TDP నాయకులు కేవలం చంద్రబా బు ఇమేజ్తోనే గెలిచేస్తాం.. ఆయన విజన్ మనల్ని కాపాడేస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇది మంచిదే. కానీ, ఎంత ఇమేజ్ ఉన్నప్పటికీ.. మోడీ కన్నా.. ఎక్కుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు పోటీ పడ్డారు.
అంతేకాదు, వీరు గెలవరు అనుకున్న చోట బీజేపీ 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. అయితే, వీరిలో కేవలం 9 మంది మాత్రమే రెబల్గా మారగా మిగిలిన వారిని పార్టీ అనుకూలంగా మార్చుకుని పనిచేయించుకుంది. ఫలితంగా గుజరాత్లో 7వ సారి దిగ్విజయ, అప్రతిహత అధికారం చేపట్టింది. దీనిని చూసైనా ఏపీలో టీడీపీ నేతలు ఎలా పనిచేయాలో నేర్చుకుంటే.. అదే అధికారం దక్కేలా చేస్తుందన్నది నిర్వివాదాంశం.
This post was last modified on December 8, 2022 9:33 pm
ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు. ముంబయికి ఏకంగా ఐదు కప్పులు…
ఏపీ వైసీపీకి పార్టీకి భారీ షాకే తగిలింది. సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ.. తన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ చీఫ్…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనా? ఇక్కడ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమేనా? అంటే…
చీపురుపల్లి అంటే తమ అడ్డా.. ఇక్కడ తనను ఓడించేది ఎవరంటూ ఇన్ని రోజులు ధీమాగా ఉన్న వైసీపీ మంత్రి బొత్స…
ఒకప్పుడు వయసుతో సంబంధం లేకుండా హీరోలు తండ్రులు తాతలుగా నటించేవాళ్ళు. ఆడియన్స్ అంగీకరించేవారు. చిరంజీవి తొలినాళ్ళలోనే సింహపురి సింహం చేయడానికి…
సినిమాలకు సంబంధం లేకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఒకేసారి వేర్వేరు కారణాల వల్ల ట్రెండింగ్ లోకి రావడం…