తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే..ఈ విజయం దక్కడం ఈ పార్టీకి ఇది దాదాపు 7వ సారి. అంటే.. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుల విజయాన్ని పక్కకు నెట్టి శతాబ్ది విజయాన్ని అందుకున్నట్టు అయింది.
అయితే.. Gujarat లో BJP గెలుపు ఒక్కరోజులోనో.. ఎలాంటి పరిశ్రమా చేయకుండానో దక్కలేదు. అడుగడుగూ.. అణువణువూ గెలవాలన్న పార్టీ నేతల తపన.. కీలక నేతల వ్యూహాలు.. వీటికి మించి.. మోడీ చరిష్మా ఇవన్నీ కూడా.. కలగలిసి.. గుజరాత్ మిఠాయిని బీజేపీకి అందేలా చేశాయి. వాస్తవానికి బలమైన ప్రతిపక్షం అనుకున్న కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేసిన విన్యాసాలు బీజేపీకి బాగా కలిసి వచ్చాయి.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. Gujarat లో అధికారంలో ఉన్నాం కదా.. అనే ధీమాను బీజేపీ వ్యక్తపరచలేదు. ఎక్కడికక్కడ ఎప్పటిక ప్పుడు.. మార్పులు చేసుకుంది. అవసరం అయితే.. సీఎం అంతటి వాడిని పక్కన పెట్టింది. తాజా ఎన్నికలకు ఏడాది ముందుగానే విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గాన్ని బీజేపీ పక్కనపెట్టింది.
అంటే కఠిన నిర్ణయాలు ఎలా ఉంటాయో.. ఇది నిరూపిస్తుంది. ఇక, ఏపీకి వస్తే.. Gujarat ఎన్నిక సారాంశం .. TDP నేతలకు ఒక చక్కని పాఠం వంటింది. ఎందుకంటే..ఇక్కడ TDP నాయకులు కేవలం చంద్రబా బు ఇమేజ్తోనే గెలిచేస్తాం.. ఆయన విజన్ మనల్ని కాపాడేస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇది మంచిదే. కానీ, ఎంత ఇమేజ్ ఉన్నప్పటికీ.. మోడీ కన్నా.. ఎక్కుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు పోటీ పడ్డారు.
అంతేకాదు, వీరు గెలవరు అనుకున్న చోట బీజేపీ 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. అయితే, వీరిలో కేవలం 9 మంది మాత్రమే రెబల్గా మారగా మిగిలిన వారిని పార్టీ అనుకూలంగా మార్చుకుని పనిచేయించుకుంది. ఫలితంగా గుజరాత్లో 7వ సారి దిగ్విజయ, అప్రతిహత అధికారం చేపట్టింది. దీనిని చూసైనా ఏపీలో టీడీపీ నేతలు ఎలా పనిచేయాలో నేర్చుకుంటే.. అదే అధికారం దక్కేలా చేస్తుందన్నది నిర్వివాదాంశం.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…