Political News

జ‌నాలకు 900 కోట్ల‌కు టోపీ.. టీటీడీ బోర్డు స‌భ్యుడి నిర్వాకం

టీటీడీ బోర్డు స‌భ్యుడు, వైసీపీ సానుభూతిప‌రుడు బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపీ పెట్టారు. అది చేస్తాం.. ఇది చేస్తాం..అని జ‌నాల‌ను న‌మ్మించివారి నుంచి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించారు. వీటి విలువ సుమారు 900 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే.. బూదాటి ఏమీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు మోస‌పోయామ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

దాదాపు 2500 మంది రెండు తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జ‌లు బూదాటి అక్ర‌మాల్లో చిక్కుకున్నారు. ‘ప్రీలాంచ్’ పేరిట కొన్ని ప్రాజెక్టుల‌ను వారికి ఆశ చూపించారు. వాటిని న‌మ్మిన ప్ర‌జ‌లు వాటిలో పెట్టుబ‌డులు పెట్టారు. ఇలా పెట్టుబ‌డుటు పెట్టిన వాటిలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్ కీల‌క‌మైంది. దీనిలోనే ఎక్కువ మంది వంద‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టారు.

23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, డ‌బుల్‌, త్రిబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెసిలిటీస్ ఉన్నాయ‌ని న‌మ్మ‌బ‌లిగారు. అంతేకాదు.. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా.. మొత్తం 1,700 మంది నుంచి 5వంద‌ల 39 కోట్ల రూపాయ‌ల‌ మేర వసూలు చేశారు. అయితే, దీనికి హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్ మెంట్ నుంచి ఎలాంటి అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ఇది ప్రారంభానికి నోచుకోలేదు.

అయితే, బాదాటి మాత్రం అనుమ‌తులు రావ‌డం ఆల‌స్య‌మైనా ప‌క్కాగా ప్రాజెక్టు ముందుకు సాగుతుంద‌ని న‌మ్మించారు. దీనిని న‌మ్మిన వారు పెట్టుబ‌డులు సుర‌క్షిత‌మే అనుకున్నారు. అయితే, 2019 నుంచి కొన‌సాగుతున్న ఈ వ్య‌వ‌హారంపై అనుమానాలు ప్ర‌బ‌ల‌డంతో చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

This post was last modified on December 3, 2022 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago