Political News

జ‌నాలకు 900 కోట్ల‌కు టోపీ.. టీటీడీ బోర్డు స‌భ్యుడి నిర్వాకం

టీటీడీ బోర్డు స‌భ్యుడు, వైసీపీ సానుభూతిప‌రుడు బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపీ పెట్టారు. అది చేస్తాం.. ఇది చేస్తాం..అని జ‌నాల‌ను న‌మ్మించివారి నుంచి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించారు. వీటి విలువ సుమారు 900 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే.. బూదాటి ఏమీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు మోస‌పోయామ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

దాదాపు 2500 మంది రెండు తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జ‌లు బూదాటి అక్ర‌మాల్లో చిక్కుకున్నారు. ‘ప్రీలాంచ్’ పేరిట కొన్ని ప్రాజెక్టుల‌ను వారికి ఆశ చూపించారు. వాటిని న‌మ్మిన ప్ర‌జ‌లు వాటిలో పెట్టుబ‌డులు పెట్టారు. ఇలా పెట్టుబ‌డుటు పెట్టిన వాటిలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్ కీల‌క‌మైంది. దీనిలోనే ఎక్కువ మంది వంద‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టారు.

23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, డ‌బుల్‌, త్రిబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెసిలిటీస్ ఉన్నాయ‌ని న‌మ్మ‌బ‌లిగారు. అంతేకాదు.. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా.. మొత్తం 1,700 మంది నుంచి 5వంద‌ల 39 కోట్ల రూపాయ‌ల‌ మేర వసూలు చేశారు. అయితే, దీనికి హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్ మెంట్ నుంచి ఎలాంటి అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ఇది ప్రారంభానికి నోచుకోలేదు.

అయితే, బాదాటి మాత్రం అనుమ‌తులు రావ‌డం ఆల‌స్య‌మైనా ప‌క్కాగా ప్రాజెక్టు ముందుకు సాగుతుంద‌ని న‌మ్మించారు. దీనిని న‌మ్మిన వారు పెట్టుబ‌డులు సుర‌క్షిత‌మే అనుకున్నారు. అయితే, 2019 నుంచి కొన‌సాగుతున్న ఈ వ్య‌వ‌హారంపై అనుమానాలు ప్ర‌బ‌ల‌డంతో చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

This post was last modified on December 3, 2022 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

9 hours ago