Political News

జ‌నాలకు 900 కోట్ల‌కు టోపీ.. టీటీడీ బోర్డు స‌భ్యుడి నిర్వాకం

టీటీడీ బోర్డు స‌భ్యుడు, వైసీపీ సానుభూతిప‌రుడు బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపీ పెట్టారు. అది చేస్తాం.. ఇది చేస్తాం..అని జ‌నాల‌ను న‌మ్మించివారి నుంచి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించారు. వీటి విలువ సుమారు 900 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే.. బూదాటి ఏమీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు మోస‌పోయామ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

దాదాపు 2500 మంది రెండు తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జ‌లు బూదాటి అక్ర‌మాల్లో చిక్కుకున్నారు. ‘ప్రీలాంచ్’ పేరిట కొన్ని ప్రాజెక్టుల‌ను వారికి ఆశ చూపించారు. వాటిని న‌మ్మిన ప్ర‌జ‌లు వాటిలో పెట్టుబ‌డులు పెట్టారు. ఇలా పెట్టుబ‌డుటు పెట్టిన వాటిలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్ కీల‌క‌మైంది. దీనిలోనే ఎక్కువ మంది వంద‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టారు.

23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, డ‌బుల్‌, త్రిబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెసిలిటీస్ ఉన్నాయ‌ని న‌మ్మ‌బ‌లిగారు. అంతేకాదు.. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా.. మొత్తం 1,700 మంది నుంచి 5వంద‌ల 39 కోట్ల రూపాయ‌ల‌ మేర వసూలు చేశారు. అయితే, దీనికి హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్ మెంట్ నుంచి ఎలాంటి అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ఇది ప్రారంభానికి నోచుకోలేదు.

అయితే, బాదాటి మాత్రం అనుమ‌తులు రావ‌డం ఆల‌స్య‌మైనా ప‌క్కాగా ప్రాజెక్టు ముందుకు సాగుతుంద‌ని న‌మ్మించారు. దీనిని న‌మ్మిన వారు పెట్టుబ‌డులు సుర‌క్షిత‌మే అనుకున్నారు. అయితే, 2019 నుంచి కొన‌సాగుతున్న ఈ వ్య‌వ‌హారంపై అనుమానాలు ప్ర‌బ‌ల‌డంతో చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

This post was last modified on December 3, 2022 3:26 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

3 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

7 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

7 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

8 hours ago