జనసేనాని పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ దురుసుగా మాట్లాడినా తన పొలిటికల్ స్కెచ్ మాత్రం కూల్ గానే ఉంటుంది. ఒక్కరోజులో రాజకీయాల్ని మార్చేయ లేమనీ, తనకు చాలా ఓపిక ఉందని తరచూ చెబుతుంటారు పవన్. జనసేన పార్టీని 2014 మార్చి 14 న స్థాపించారు పవన్ కళ్యణ్. 2023 మార్చికి పార్టీ ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు. చాలామంది రాజకీయ నాయకులు మధ్యలోనే పవన్ తోక ముడుస్తాడనీ, సినిమాలు చేసుకుంటాడనీ ఎద్దేవా చేశారు. కానీ.. పవన్ మాత్రం పొలిటికల్ యూ టర్న్ తీసుకోలేదు. ఐతే.. జనసేన పార్టీకి ఓ స్టాండ్ లేదన్న విమర్శల్ని మాత్రం పవన్ గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారని పొలిటికల్ ఎనలిస్టుల అభిప్రాయం.
గతంలో బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన చేతులు కలిపాయని వైసీపీ విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఈసారి కూడా దాన్నే ఆయుధంగా మలుచుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఐతే.. ఈసారి సీన్ మరో విధంగా ఉండబోతుదనీ.. ఆ దిశగానే పవన్ పావులు కదుపుతున్నాడనీ, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టబోతున్నాడనీ తెలుస్తోంది. ఇంతకీ పవన్ ఎవరితో జతకడతారు.. ? ఎటు వైపు అడుగులేస్తారు.. ? అనేది తెలియాలంటే పవన్, మోదీ భేటీలో ఏం జరిగందో తెలియాలి.
పవన్, మోదీ భేటీలో చాలా అంశాలు చర్చకొచ్చాయని లీక్స్ వస్తున్నాయి. టీడీపీతో కలసి వెళితే.. ఎలా నష్టపొతాడో పవన్ కు మోదీ క్లియర్ గా వివరించారని తెలుస్తోంది. అతేకాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపో తుందనీ, ఆ పార్టీ ఉనికి కూడా ఉండదని మోజీ జోస్యం చెప్పారట.
అందుకే.. భవిష్యత్తు ప్రణాళికలపై కూడా చర్చ నడిచినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గల్లంతవుతుంది కాబట్టి.. రాబోయే రోజుల్లో జనసేన, బీజేపీలు ఎలా బంలం పుంజుకోవాలి అన్న వ్యూహ రచన కూడా జరిగందట. భవిష్యత్తులో పవన్ కు సీయం పీఠం అప్పగిస్తానని మోదీ ప్రామిస్ కూడా చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
దీర్ఘకాలిక ప్రణాళికతోనే పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జనసైనికుల్లో ధైర్యం నింపి, కర్తవ్యబోధ చేస్తున్నాడట. మోదీ అండతోనే వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నాడనీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.
పవన్ టీడీపీతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్నారని అంటున్నారు. అదే జరిగితే.. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ పై విరుచుకుపడుతున్న వైసీపీ నేతల విమర్శలకు బ్రేకుల పడినట్లే అవుతుంది. మరి పవన్ లాంగ్ టర్మ్ ప్లాన్ సరైన ఫిలితాల్నిస్తుందో లేదో చూడాలి.
This post was last modified on December 1, 2022 9:29 pm
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…