వరుస వివాదాలు.. వైసీపీలో కీలక నాయకుడిని ఏకాకి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఆయనకు పార్టీ అధిష్టానం కూడా దూరంగా ఉంటోందని అంటున్నారు. ఇక, జిల్లాలో అయినా.. నాయకులకుఆయనకు అసలు పడడం లేదని చెబుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. తాజాగా ఆయనను పార్టీలోని జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది.
దీనికి కారణం వరుస వివాదాలేనని అంటున్నారు లోకల్ నాయకులు. గతంలో అరగంట.. అంటూ ఒక ఆడియో క్లిప్ రాగా.. తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అది కాస్తా పోయింది. ఇది ఆ ఎఫెక్టే అనే వాదన వినిపించింది. ఇక, ఇటీవల మరో ఆడియో కూడా కలకలం రేపింది. ఈ పరిణామాల తర్వాత పార్టీలో కీలక బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. సో ఈ రెండు ఘటనలనుపార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుం దని అందుకే ఆయనకు వరుస షాకులు తగిలాయని అంటున్నారు.
ఇక, మరోవైపు.. విశాఖపట్నంలోని ముఖ్యనాయకులకు, అవంతికి మధ్య గ్యాప్ అలానే ఉంది. ఇంతకు ముందు ఆయన బలమైన గళంగా ఉండేవారు. అయితే, తనను సాయిరెడ్డి డామినేట్ చేస్తున్నారని, అప్పట్లో మంత్రిగా ఉన్నా.. తనను పట్టించుకోలేదని అనేవారు. ఇక, ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. పోనీ ఆయనైనా అవంతి విషయంలో సానుకూలంగా ఉన్నారా? అంటే, అది కూడా కనిపించడం లేదు.
ఇవన్నీ ఇలా ఉంటే, తనకు రాజకీయంగా వైరం ఉన్న గంటా శ్రీనివాసరావుకు వైసీపీ మళ్లీ మళ్లీ ఆఫర్లు ఇస్తుండడం అవంతికి అసలు నచ్చడం లేదు, గంటా ఎక్కడ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారోనని భావిస్తున్న వైసీపీ, ఇటీవల కూడా ఆయనకు ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనే కనుక వైసీపీలోకి వస్తే.. తన భీమిలి సీటుకు ఎసరు పెట్టడం ఖాయమని.పైగా.. అంతో ఇంతో ఉన్న హవా కూడా తుడిచి పెట్టుకుపోతుందని కూడా అవంతి తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.
This post was last modified on November 28, 2022 1:16 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…