వరుస వివాదాలు.. వైసీపీలో కీలక నాయకుడిని ఏకాకి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఆయనకు పార్టీ అధిష్టానం కూడా దూరంగా ఉంటోందని అంటున్నారు. ఇక, జిల్లాలో అయినా.. నాయకులకుఆయనకు అసలు పడడం లేదని చెబుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. తాజాగా ఆయనను పార్టీలోని జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది.
దీనికి కారణం వరుస వివాదాలేనని అంటున్నారు లోకల్ నాయకులు. గతంలో అరగంట.. అంటూ ఒక ఆడియో క్లిప్ రాగా.. తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అది కాస్తా పోయింది. ఇది ఆ ఎఫెక్టే అనే వాదన వినిపించింది. ఇక, ఇటీవల మరో ఆడియో కూడా కలకలం రేపింది. ఈ పరిణామాల తర్వాత పార్టీలో కీలక బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. సో ఈ రెండు ఘటనలనుపార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుం దని అందుకే ఆయనకు వరుస షాకులు తగిలాయని అంటున్నారు.
ఇక, మరోవైపు.. విశాఖపట్నంలోని ముఖ్యనాయకులకు, అవంతికి మధ్య గ్యాప్ అలానే ఉంది. ఇంతకు ముందు ఆయన బలమైన గళంగా ఉండేవారు. అయితే, తనను సాయిరెడ్డి డామినేట్ చేస్తున్నారని, అప్పట్లో మంత్రిగా ఉన్నా.. తనను పట్టించుకోలేదని అనేవారు. ఇక, ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. పోనీ ఆయనైనా అవంతి విషయంలో సానుకూలంగా ఉన్నారా? అంటే, అది కూడా కనిపించడం లేదు.
ఇవన్నీ ఇలా ఉంటే, తనకు రాజకీయంగా వైరం ఉన్న గంటా శ్రీనివాసరావుకు వైసీపీ మళ్లీ మళ్లీ ఆఫర్లు ఇస్తుండడం అవంతికి అసలు నచ్చడం లేదు, గంటా ఎక్కడ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారోనని భావిస్తున్న వైసీపీ, ఇటీవల కూడా ఆయనకు ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనే కనుక వైసీపీలోకి వస్తే.. తన భీమిలి సీటుకు ఎసరు పెట్టడం ఖాయమని.పైగా.. అంతో ఇంతో ఉన్న హవా కూడా తుడిచి పెట్టుకుపోతుందని కూడా అవంతి తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.
This post was last modified on November 28, 2022 1:16 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…