Political News

పవన్ ఇలా చేస్తే.. వైసీపీ త‌డిగుడ్డ వేసుకుని ప‌డుకోవచ్చు

వ‌చ్చే 2024 ఎన్నిక‌లు హాట్ గురూ.. అంటూ ప్ర‌చారంలో ఉన్నా తాజాగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, మార్పులు చూస్తే.. మ‌రోసారి వైసీపీకి అధికారం బంగారుప‌ళ్లెంలో పెట్టి అందిస్తున్నారే! అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు వస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తానంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గ‌త కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జ‌ర‌గాలంటే.. క‌మ్యూనిస్టులు చెబుతున్న‌ట్టు అన్ని పార్టీలు క‌లిసి తీరాలి. బీజేపీ ఉంటే క‌మ్యూనిస్టులు క‌ల‌వ‌రు కాబ‌ట్టి వారిని ప‌క్క‌న పెట్టాలి.

స‌రే.. ఈ విష‌యంలో క‌మ్యూనిస్టుల‌ను ప‌క్క‌న పెట్టినా.. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు క‌లిసి తీరాలి. అయితే.. దీనికి అనుకూలంగా ఇప్పుడు ప‌రిస్థితి ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రంలోనూ.. ఇప్పుడు మంగ‌ళ‌గిరిలోనూ ప‌వ‌న్ దాదాపు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి తీరుతామ‌ని.. జ‌న‌సేన అధికారంంలోకి రాగానే వైసీపీ నేత‌లను త‌రిమితరిమి కొడ‌తామ‌ని అన్నారు. అంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగానే పోటీ చేయ‌నుంద‌నేది స్ప‌ష్టంగా చెప్పిన‌ట్టే!

మ‌రి ఇదే జ‌రిగితే.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలేది ఎక్క‌డా? ఆ పార్టీని అధికారం నుంచి దూరం పెట్టేది ఎక్క‌డా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇప్ప‌డున్న ప‌రిస్థితిలో వైసీపీ వ్య‌తిర‌క‌త ఉన్న‌మాట వాస్త‌వమే. అయితే, దీనిని ఒడిసి ప‌ట్టుకునే తీరుక‌నుక స‌రిగా లేక‌పోతే.. ఆ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చెట్టుకొక‌టి పుట్ట‌కొక‌టి అన్న‌ట్టుగా ప‌డి.. ఏ పార్టీకి కూడా ప్ర‌యోజనం లేకుండా పోయి.. చివ‌ర‌కు వైసీపీకి మ‌రోసారి అధికారం ద‌ఖ‌లు ప‌డేలా చేస్తుంద‌నేది రాజ‌కీయ నేత‌లే చెబుతున్న విష‌యం.

అస‌లు వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌న్న ప‌వ‌నే ఇప్పుడు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం.. క‌నీసం.. టీడీపీ మాట‌ను కానీ, ఆ పార్టీ నేత‌ల పేర్లు కానీ, ప్ర‌స్తావించ‌కుండానే స‌భ‌లు నిర్వ‌హించ‌డం.. వంటివి వైసీపికి ప‌రోక్షంగా మేలు చేస్తున్న‌వేన‌ని చెబుతున్నారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు టీడీపీతో క‌లిసి పోరాటం చేస్తాన‌న్న ప‌వ‌న్‌.. ఆ వూసే మ‌రిచిపోయారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబైనా.. ప‌వ‌న్ పేరు ఎత్తుతు న్నారు కానీ, ప‌వ‌న్ మాత్రం తాజాగా సంద‌ర్భం వ‌చ్చినా.. ప్ర‌తిప‌క్షం అంటూ.. దాట‌వేశారు. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. వైసీపీ నేత‌లు త‌డిగుడ్డ నెత్తిన వేసుకుని ప‌డుకోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on November 28, 2022 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

20 minutes ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

21 minutes ago

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

3 hours ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

4 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

6 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

6 hours ago