Political News

బాబాయికి గుండెపోటు, కోడిక‌త్తి డ్రామాలు నాకు రావ్‌! : ప‌వ‌న్

తాజాగా మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పాల‌క‌ వైసీపీనేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను ప్ర‌స్తావించారు. బ‌హుశ‌.. ప‌వ‌న్ ఇటీవ‌ల కాలంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. “క‌త్తుల‌, గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించే వాళ్లం కాదు మేం. మేం క‌ష్టాన్ని న‌మ్ముకున్నాం. మీ లాగా.. పాపం వైఎస్ వివేకానంద‌రెడ్డిగారిని.. క‌త్తులు గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించి హ‌త్య చేయించ‌లేదు” అని అన్నారు.

అంతేకాదు.. హ‌త్య చేసిన వారిని క‌నీసం విచార‌ణ‌కు కూడా రాకుండా కాపాడుతున్నార‌ని ప‌రోక్షంగా ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొంద‌రిని ప‌వ‌న్‌ పేర్కొన్నారు. బాత్‌రూంలో చంపేసి, గుండెపోటు నాట‌కం ఆడి.. ఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా త‌మ‌కు లేద‌న్నారు. కోడిక‌త్తి డ్రామాలు ఆడించి ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా త‌మ‌వైపుతిప్పుకొనే కుళ్లు, కుట్ర రాజ‌కీయం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. ప్ర‌జ‌లకు మొహం మీదే చెబుతాం. వాళ్ల‌ను న‌మ్మించి.. త‌డిగుడ్డ‌తో గొంతు కోసే టైపు కాదు.. అని వ్యాఖ్యానించారు.

“రాష్ట్రంలో అత్యాచారాలు జ‌రిగిన ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేక‌పోతే.. క‌నీసం ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. ఒక‌టి రెండు రేపుల‌కే ఇంత గొడ‌వ చేస్తారా? అని వ్యాఖ్యానించారు. ఆడ‌బిడ్డ‌ల‌పై అత్యాచారాలు జ‌రిగితే.. త‌ల్లుల పెంప‌కాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇంత క‌న్నా దౌర్భాగ్య‌మైన నాయ‌కులు ఉన్నారా? ఇది తోలు మందం బ్యాచ్‌. వారికి, వారి ఇంట్లోవారికి ఏదైనా జ‌రిగితే త‌ప్ప వీరికి బాధ‌లు తెలియ‌వు. వీరికి చీమ‌కుట్ట‌దు” అని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా త‌నచిన్న నాటి ఘ‌ట‌న‌ల‌ను ప‌వ‌న్ గుర్తు చేసుకున్నారు. తాను నెల్లూరులో ఒక స్కూల్‌లో చ‌దువుకునే స‌మ‌యంలో ఆ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ఇంటి గోడ‌పై.. “ర‌మిజాబి ఘ‌ట‌న‌లో దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాలి” అని రాసి ఉంది. దీనిని త‌ర్వాత తెలుసుకున్నాన‌ని అన్నారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని ఓ పోలీసు స్టేష‌న్‌లో ర‌మిజాబి అనే మ‌హిళ‌తో పాటు ఆమె భ‌ర్త‌ను కూడా తీసుకువ‌చ్చి హింసించార‌ని ప‌వ‌న్ చెప్పారు.

ఆ స‌మ‌యంలో భ‌ర్త చ‌నిపోగా, ర‌మిజాబిపై సామూహిక అత్యాచారం జ‌రిగింద‌ని.. దీనిపై అప్ప‌ట్లో క‌న్న‌బిరాం పోరాట స్ఫూర్తితో ఈ ఒక్క ఘ‌ట‌న‌పై దేశాన్నే క‌దిలించార‌ని అన్నారు. ఇప్పుడు జ‌న‌సేన కూడా అదే చేస్తోందని చెప్పారు. ఎక్క‌డ ఏతల్లిపై ఎలాంటి అఘాయిత్యం జ‌రిగినా.. దానిపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామ‌ని.. ఎక్క‌వ ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా..అది త‌న‌కే అనుకుని పోరాటంలోకి దిగుతాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

Satya

Recent Posts

‘బీజేపీ ఆడమన్నట్టు పవన్ అడుగుతున్నారు’

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…

47 minutes ago

అజిత్ సెట్టవ్వకపోతే.. టాలీవుడ్ హీరో..

మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…

1 hour ago

కూటమి నేతలను సైతం వదలొద్దంటున్న పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…

2 hours ago

అక్కినేని కోడలు విమర్శలను జయిస్తుందా?

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…

2 hours ago

చరణ్ లైనప్ లో పెద్ది ఇంపాక్ట్

పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్‌లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ని నిలబెట్టుకోవాలి.…

2 hours ago

ప్రమోషన్లు నిల్లు… సినిమా కిల్లు

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…

3 hours ago