Political News

బాబాయికి గుండెపోటు, కోడిక‌త్తి డ్రామాలు నాకు రావ్‌! : ప‌వ‌న్

తాజాగా మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పాల‌క‌ వైసీపీనేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను ప్ర‌స్తావించారు. బ‌హుశ‌.. ప‌వ‌న్ ఇటీవ‌ల కాలంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. “క‌త్తుల‌, గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించే వాళ్లం కాదు మేం. మేం క‌ష్టాన్ని న‌మ్ముకున్నాం. మీ లాగా.. పాపం వైఎస్ వివేకానంద‌రెడ్డిగారిని.. క‌త్తులు గొడ్డ‌ళ్లు, బాడిత‌లు ఉప‌యోగించి హ‌త్య చేయించ‌లేదు” అని అన్నారు.

అంతేకాదు.. హ‌త్య చేసిన వారిని క‌నీసం విచార‌ణ‌కు కూడా రాకుండా కాపాడుతున్నార‌ని ప‌రోక్షంగా ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొంద‌రిని ప‌వ‌న్‌ పేర్కొన్నారు. బాత్‌రూంలో చంపేసి, గుండెపోటు నాట‌కం ఆడి.. ఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా త‌మ‌కు లేద‌న్నారు. కోడిక‌త్తి డ్రామాలు ఆడించి ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా త‌మ‌వైపుతిప్పుకొనే కుళ్లు, కుట్ర రాజ‌కీయం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. ప్ర‌జ‌లకు మొహం మీదే చెబుతాం. వాళ్ల‌ను న‌మ్మించి.. త‌డిగుడ్డ‌తో గొంతు కోసే టైపు కాదు.. అని వ్యాఖ్యానించారు.

“రాష్ట్రంలో అత్యాచారాలు జ‌రిగిన ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేక‌పోతే.. క‌నీసం ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. ఒక‌టి రెండు రేపుల‌కే ఇంత గొడ‌వ చేస్తారా? అని వ్యాఖ్యానించారు. ఆడ‌బిడ్డ‌ల‌పై అత్యాచారాలు జ‌రిగితే.. త‌ల్లుల పెంప‌కాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇంత క‌న్నా దౌర్భాగ్య‌మైన నాయ‌కులు ఉన్నారా? ఇది తోలు మందం బ్యాచ్‌. వారికి, వారి ఇంట్లోవారికి ఏదైనా జ‌రిగితే త‌ప్ప వీరికి బాధ‌లు తెలియ‌వు. వీరికి చీమ‌కుట్ట‌దు” అని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా త‌నచిన్న నాటి ఘ‌ట‌న‌ల‌ను ప‌వ‌న్ గుర్తు చేసుకున్నారు. తాను నెల్లూరులో ఒక స్కూల్‌లో చ‌దువుకునే స‌మ‌యంలో ఆ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ఇంటి గోడ‌పై.. “ర‌మిజాబి ఘ‌ట‌న‌లో దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాలి” అని రాసి ఉంది. దీనిని త‌ర్వాత తెలుసుకున్నాన‌ని అన్నారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని ఓ పోలీసు స్టేష‌న్‌లో ర‌మిజాబి అనే మ‌హిళ‌తో పాటు ఆమె భ‌ర్త‌ను కూడా తీసుకువ‌చ్చి హింసించార‌ని ప‌వ‌న్ చెప్పారు.

ఆ స‌మ‌యంలో భ‌ర్త చ‌నిపోగా, ర‌మిజాబిపై సామూహిక అత్యాచారం జ‌రిగింద‌ని.. దీనిపై అప్ప‌ట్లో క‌న్న‌బిరాం పోరాట స్ఫూర్తితో ఈ ఒక్క ఘ‌ట‌న‌పై దేశాన్నే క‌దిలించార‌ని అన్నారు. ఇప్పుడు జ‌న‌సేన కూడా అదే చేస్తోందని చెప్పారు. ఎక్క‌డ ఏతల్లిపై ఎలాంటి అఘాయిత్యం జ‌రిగినా.. దానిపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామ‌ని.. ఎక్క‌వ ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా..అది త‌న‌కే అనుకుని పోరాటంలోకి దిగుతాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

This post was last modified on November 28, 2022 9:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

2 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

2 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

3 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

3 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

5 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

6 hours ago