ఔను! రాజకీయాల్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా బీజేపీలో ఉన్న ఇప్పటి తరం నేతలు ఏంచేశారన్నా.. వారికి అర్ధం పరమార్థం దక్కకుండా ఏదీ చేయరు. అది ఏదైనా కావొచ్చు. అటు పార్టీకి, లేదా వారికి ఉపయో గం ఉంటుందంటేనే అడుగుతీసి అడుగు వేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ విషయంలోనూ అదే జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రకటించారు.
ఇటీవల కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవాలని సూచించినా ఆయన పట్టించుకోలేదు. అంతేకాదు, ఇటీవల రాహుల్ గాంధీ హైదరాబాద్లో పర్యటించినప్పుడు కూడా మర్యాద పూర్వకంగా అయినా వచ్చి పొమ్మని కొందరు అత్యంత కీలక నాయకులు, సినీ మాజీ నటులు కూడా ఆయనకు సందేశాలు పంపించారు. కానీ, చిరు మాత్రం సున్నితంగా తిరస్కరించారు.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా ప్రధాని మోడీ వల విసురుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా ఆయనను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దీ ఇయర్ -2022 జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో(అటానమస్ అంటారు కానీ,..?) ఉంటుంది. దీనికి ఎంతో మంది దిగ్గజ నటులు పోటీ పడ్డారు. అయినా.. కూడా పట్టుబట్టి చిరును ఎంపిక చేశారు. అంతేకాదు.. కేంద్రంలోని పెద్దలు వరుస పెట్టి చిరుకు అభినందనలు తెలుపుతున్నారు.
ఈ పురస్కారానికి 100 కు 200 శాతం చిరంజీవికి అర్హత ఉన్నప్పటికీ ఇచ్చిన వారు, ప్రకటించిన వారి విషయంలోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరిలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ ప్రధాని మోడీ చిరుతో రహస్యంగా వేదికపైనే చెవిలో ఏదో చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా అవార్డు.. పైగా ఆసేతు హిమాచలం నుంచి చిరుకు కూడా తెలియని పెద్దల అభినందనలు. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఆశిస్తున్నారని, గేలం బలంగానే వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 21, 2022 4:52 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…