Political News

ఏసేశాడు.. జ‌గ‌న్ ఫుల్‌ గా ఏసేశాడు.. !

ఏసేశాడు.. జ‌గ‌న్‌.. బాగా ఏసేశాడు! ఇదీ.. ఇప్పుడు హాట్ టాపిక్ . తాజాగా టీడీపీ డిసెంబ‌రు 1 నుంచి ప్ర‌తిష్టా త్మ‌కంగా ప్రారంభించాల‌ని భావిస్తున్న ‘ఇదేం ఖ‌ర్మ‌’ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ఆడేసుకున్నారు. తాజాగా న‌ర‌సాపురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌త్స్య‌కారుల‌కు సంబంధించిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన జ‌గ‌న్ అనంత‌రం.. జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ పై విరుచుకుప‌డ్డారు. ద‌త్త‌పుత్రుడిని వెంట‌బెట్టుకుని 2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు చేసింది చెప్పుకొనేందుకు ఏమీ లేద‌ని విరుచుకుప‌డ్డారు. అందుకే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ‘ఇదేం ఖ‌ర్మ రా బాబూ’ అంటూ.. ఇంటికి త‌రిమి కొట్టార‌ని వ్యాఖ్యానించారు. ఇదేం ఖ‌ర్మ అని ప్ర‌జ‌లు తిప్పికొట్టినా చంద్ర‌బాబుకు త‌త్వం బోధ‌ ప‌డ‌లేద‌న్నారు.

త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్ని వ‌ర్గాల వారికీ అభివృద్ధిని చేరువ చేస్తున్నామ‌న్న జ‌గ‌న్‌.. మ‌త్స్య‌కారుల‌కు ప్ర‌త్యేకంగా అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. చివ‌ర‌కు కుప్పంలో కూడా వైసీపీని ప్ర‌జ‌లు ఆద‌రించే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నామ‌నంటే.. ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ అని టీడీపీని కుప్పం ప్ర‌జ‌లు త‌రిమికొట్ట‌డం వ‌ల్లే కదా! అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

దేవుడిదేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్‌ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

13 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

35 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago