Political News

ఏసేశాడు.. జ‌గ‌న్ ఫుల్‌ గా ఏసేశాడు.. !

ఏసేశాడు.. జ‌గ‌న్‌.. బాగా ఏసేశాడు! ఇదీ.. ఇప్పుడు హాట్ టాపిక్ . తాజాగా టీడీపీ డిసెంబ‌రు 1 నుంచి ప్ర‌తిష్టా త్మ‌కంగా ప్రారంభించాల‌ని భావిస్తున్న ‘ఇదేం ఖ‌ర్మ‌’ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ఆడేసుకున్నారు. తాజాగా న‌ర‌సాపురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌త్స్య‌కారుల‌కు సంబంధించిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన జ‌గ‌న్ అనంత‌రం.. జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ పై విరుచుకుప‌డ్డారు. ద‌త్త‌పుత్రుడిని వెంట‌బెట్టుకుని 2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు చేసింది చెప్పుకొనేందుకు ఏమీ లేద‌ని విరుచుకుప‌డ్డారు. అందుకే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ‘ఇదేం ఖ‌ర్మ రా బాబూ’ అంటూ.. ఇంటికి త‌రిమి కొట్టార‌ని వ్యాఖ్యానించారు. ఇదేం ఖ‌ర్మ అని ప్ర‌జ‌లు తిప్పికొట్టినా చంద్ర‌బాబుకు త‌త్వం బోధ‌ ప‌డ‌లేద‌న్నారు.

త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్ని వ‌ర్గాల వారికీ అభివృద్ధిని చేరువ చేస్తున్నామ‌న్న జ‌గ‌న్‌.. మ‌త్స్య‌కారుల‌కు ప్ర‌త్యేకంగా అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. చివ‌ర‌కు కుప్పంలో కూడా వైసీపీని ప్ర‌జ‌లు ఆద‌రించే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నామ‌నంటే.. ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ అని టీడీపీని కుప్పం ప్ర‌జ‌లు త‌రిమికొట్ట‌డం వ‌ల్లే కదా! అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

దేవుడిదేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్‌ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు.

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

32 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

48 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago