Political News

పాద‌యాత్ర‌ల ఏపీ.. ఎన్ని పార్టీలంటే!

ఏపీలో రాజ‌కీయ పార్టీల‌ పాద‌యాత్ర‌లు ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దెదించి.. త‌మ త‌మ పార్టీల‌ను అధికారంలోకి తెచ్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగాపార్టీలు పాద‌యాత్ర‌ల‌కు స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు, పార్టీ యువ నాయ‌కుడు నారా లోకేష్ పాద‌యాత్ర‌కు రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఈయ‌న జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్నారు. దాదాపు 400 రోజులు నిర్విరామంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఆయ‌న ప్లాన్ చేసుకున్నారు.

ఇక‌, బీజేపీ కూడా.. వ‌చ్చే జ‌న‌వ‌రిలో సంక్రాంతి ముగిసిన త‌ర్వాత‌.. పాద‌యాత్ర‌కు రెడీ అవుతోంది. గ్రామాల‌ను వ‌దిలేసి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బీజేపీని పుంజుకునేలా చేసేందుకు పాద‌యాత్ర చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు పార్టీ కీలక నాయ‌కుడు.. స‌త్య ప్ర‌క‌టించారు. అయితే..ఈ పాద‌యాత్ర విష‌యాన్ని పార్టీ అధిష్టానం వ‌ద్ద చ‌ర్చించి.. అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుందని, ఇది వ్య‌క్తిగ‌త పాద‌యాత్ర కాద‌ని.. నాయ‌కులు అంద‌రూ క‌లిసి.. పాద‌యాత్ర‌లో పాల్గొంటార‌ని.. ఇది ఆరు మాసాల పాటు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా పాద‌యాత్ర‌కు రెడీ అవుతోంది. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ ఏపీ అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ప్ర‌క‌టించారు. తమ పాదయాత్రకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీలు కలిసిపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని శైలజానాథ్ విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో వైసీపీ ప్ర‌భుత్వం విఫలమయ్యిందని మండిపడ్డారు.

ఇక‌, జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర‌కు బ‌దులుగా బ‌స్సు యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అయితే, దీనికి ఈ ఏడాది అక్టోబ‌రులోనే ముహూర్తం ప్ర‌క‌టించినా.. వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి త‌ర్వాత‌.. లేదా.. సంక్రాంతి త‌ర్వాత‌.. ఈ బ‌స్సు యాత్ర ఉంటుంద‌ని పార్టీ కీల‌క నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. ఇలా.. మొత్తంగా ఏపీలో 2023 పాద‌యాత్ర‌ల నామ సంవ‌త్స‌రంగా మారుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ పాద‌యాత్ర‌ల‌ను ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

This post was last modified on November 15, 2022 7:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago