Political News

మోడీ-పవన్.. బాబు-రామోజీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. జనసేనాని విశాఖపట్నం పర్యటన తర్వాత చంద్రబాబు ఆయన్ని కలవడం రాజకీయంగా వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. పవన్‌ను జగన్ సర్కారు విశాఖలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు విజయవాడకు వెళ్లడం.. ఇద్దరూ కలిసి విలేకరులతో కలివిడిగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది.

ఇది తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంకేతమని అందరూ భావించారు. కొన్ని రోజులు గడిచేసరికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. విశాఖపట్నంలో శనివారం సభ జరగబోతుండగా.. ముందు రోజు మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమావేశం జరగడానికి ముందే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు నాయుడు.. ఈనాడు అధినేత రామోజీ రావును కలవడం చర్చనీయాంశం అయింది.

మోడీతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆంతరంగిక సమావేశంలో పాల్గొన్నాడు పవన్. ఈ సమావేశంలో ఏం చర్చ జరిగిందన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో బంధానికి బైబై చెప్పి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఆపడానికి మోడీ ప్రయత్నించి ఉంటాడనే చర్చ జరుగుతోంది. అలా కాకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లడం గురించి కూడా మాట్లాడి ఉండొచ్చని.. ఐతే పవన్ మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రధానికి చెప్పిన జగన్‌ను ఓడించాల్సిన అవసరాన్ని గుర్తు చేసి ఉంటారని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఇక్కడ మోడీ పర్యటన జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌కు వెళ్లి బాబు.. రామోజీని కలవడం మరో ఆసక్తికర చర్చకు దారి తీసింది. చంద్రబాబు రాజకీయంగా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రామోజీని సంప్రదిస్తారని అంటుంటారు. పొత్తులతో పాటు జగన్‌ను ఎదుర్కొనే విషయంలో బాబు-రామోజీ మధ్య చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

This post was last modified on November 14, 2022 10:31 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

4 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

5 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

6 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

7 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

7 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

8 hours ago