Political News

మోడీ-పవన్.. బాబు-రామోజీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. జనసేనాని విశాఖపట్నం పర్యటన తర్వాత చంద్రబాబు ఆయన్ని కలవడం రాజకీయంగా వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. పవన్‌ను జగన్ సర్కారు విశాఖలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు విజయవాడకు వెళ్లడం.. ఇద్దరూ కలిసి విలేకరులతో కలివిడిగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది.

ఇది తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంకేతమని అందరూ భావించారు. కొన్ని రోజులు గడిచేసరికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. విశాఖపట్నంలో శనివారం సభ జరగబోతుండగా.. ముందు రోజు మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమావేశం జరగడానికి ముందే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు నాయుడు.. ఈనాడు అధినేత రామోజీ రావును కలవడం చర్చనీయాంశం అయింది.

మోడీతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆంతరంగిక సమావేశంలో పాల్గొన్నాడు పవన్. ఈ సమావేశంలో ఏం చర్చ జరిగిందన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో బంధానికి బైబై చెప్పి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఆపడానికి మోడీ ప్రయత్నించి ఉంటాడనే చర్చ జరుగుతోంది. అలా కాకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లడం గురించి కూడా మాట్లాడి ఉండొచ్చని.. ఐతే పవన్ మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రధానికి చెప్పిన జగన్‌ను ఓడించాల్సిన అవసరాన్ని గుర్తు చేసి ఉంటారని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఇక్కడ మోడీ పర్యటన జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌కు వెళ్లి బాబు.. రామోజీని కలవడం మరో ఆసక్తికర చర్చకు దారి తీసింది. చంద్రబాబు రాజకీయంగా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రామోజీని సంప్రదిస్తారని అంటుంటారు. పొత్తులతో పాటు జగన్‌ను ఎదుర్కొనే విషయంలో బాబు-రామోజీ మధ్య చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

5 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

6 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

6 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

7 hours ago