Political News

ఏపీలో సైలెంట్‌.. తెలంగాణ‌లో వైలెంట్‌

ఏపీలో ప్ర‌ధాని ప‌ర్య‌టించారు.కానీ, ఇక్క‌డ అవినీతి కానీ, ఇక్క‌డ ప్ర‌భుత్వ దూకుడు కానీ, కుటుంబ పాల‌న కానీ, ఆయ‌న‌కు మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. కానీ, ఇలా విశాఖ నుంచి తెలంగాణ‌ గ‌డ్డ‌పై అడుగు పెట్టారో లేదో.. వెంట‌నే మోడీకి అవినీతి క‌నిపించింది. కుటుంబ పాల‌న క‌నిపించింది.. అంత‌కు మించి చాలానే క‌నిపించాయి. దీంతో నెటిజ‌న్లు.. ఏపీలో సైలెంట్.. తెలంగాణ‌లో వైలెంటా.. మోడీ జీ వాటీజ్ దిస్‌? ! అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు.

మ‌రి ఇంత‌కీ మోడీ ఏమ‌న్నారంటే..

అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులోకి అడుగు పెడుతూనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు సిద్ధమన్నారు. పేదలను దోచుకునేవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాలన్నారు. (సీఎం కేసీఆర్ స‌చివాల‌యాన్ని కొత్త‌గా క‌డుతున్నాడు క‌దా)

కేబినెట్‌లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో.. మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలన్నారు. 22 ఏళ్లుగా ఎందరితోనో ఎన్నో తిట్లు తిన్నాను.. రోజు కిలోల కొద్దీ తిట్లు తింటాను.. అందుకే అలసిపోను.. అని మోడీ అన్నారు. మోడీని తిట్టేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ప‌రోక్షంగా కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు.

చక్కగా తిట్లు వింటూ.. చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సర్కార్‌కు రోజూ మోడీని తిట్టేందుకే సమయం సరిపోతోందన్నారు. మీరెన్ని తిట్లు తిట్టినా వాటిని అరిగించుకునే శక్తి తమలో ఉందన్నారు. తెలంగాణ సమాజాన్ని తిడితే మాత్రం అంతకంతా ప్రతీకారం తప్పదని మోడీ పేర్కొన్నారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవన్నారు. కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామన్నారు.

This post was last modified on November 12, 2022 10:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

21 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

1 hour ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

2 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago