Political News

తెలంగాణ  ప్ర‌భుత్వాన్ని కూల‌దోస్తాం: మోడీ

తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పేరు ఎత్త‌కుండానే సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోస్తామ‌ని వ్యాఖ్యానించారు. వాస్త‌వానకి ఏ నాయ‌కుడైనా తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెబుతారు. కానీ ఉన్న ప్ర‌బుత్వాన్ని కూల‌దోస్తామ‌ని ఎవ‌రూ చెప్ప‌రు. కానీ, మోడీ మాత్రం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా విశాఖ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్న ప్ర‌ధాని బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కార్యకర్తలను చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని ప్రధాని అన్నారు. తెలంగాణ బీజేపీ శ్రేణులు బలమైన శక్తులని, ఎవరికీ భయపడరని కొనియాడారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపారన్నారు.

మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారు. ఒక అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు పోయింది. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదు. మునుగోడులో కమల వికాసం కనిపించింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారు.. అని మోడీ అన్నారు.

హైదరాబాద్‌ ఐటీ రంగానికి హబ్‌గా మారింది. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయి. మూఢవిశ్వాసాలను బీజేపీ పారదోలుతుంది. ఎర్రజెండా నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులు. అలాంటి వారితో టీఆర్ ఎస్ సర్కారు చేతులు కలిపింది. ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే బీజేపీ రాజకీయాలు చేస్తోంది.. అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

బీజేపీకి తెలంగాణలో సానుకూల పరిస్థితి ఉంది. కరోనా సమయంలో   తెలంగాణలోనూ 2 కోట్ల మందికి రేషన్‌ బియ్యం పంపిణీ చేశాం. ప్రధాని ఆవాస్‌ యోజన పథకాన్ని టీఆర్ ఎస్‌ సర్కారు నిర్వీర్యం చేసింది. రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని ఆవాస్‌ యోజన పథకం లబ్ధి దక్కకుండా చేశారు. నా తొలి ప్రాధాన్యత ప్రజలకే.. కుటుంబానికి కాదు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే నా లక్ష్యం.. అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 12, 2022 5:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

52 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

4 hours ago