కొన్ని కొన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి. నమ్మడానికి కూడా ఒకింత ఇబ్బందిగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే అతి పెద్ద జాతీయ పార్టీ బీజేపీలో కనిపిస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు.. ఈ పార్టీలోని నాయకులు వాజపేయి నుంచి అడ్వాణీ వరకు.. అందరూ కూడా.. బీజేపీని చూసి ఓటేయండి.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను చూసి గెలిపించండి.. అని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఆ సేతు హిమాచలం అందరూ కూడా ఇదే నినాదం పట్టుకుని ప్రచారం చేసిన ఎన్నికలు అనేకం ఉన్నాయి.
కానీ, ఇప్పుడు బీజేపీ రంగు మారకపోయినా.. రూపం మారకపోయినా.. ఆత్మ మాత్రం మారిపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి రెండు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండు గుజరాత్. ఈ రెండు చోట్ల కూడా.. బీజేపీ తన సిద్ధాంతాలను, రాద్ధాంతాలను వదిలేసింది. కేవలం ఒకే ఒక నాయకుడు.. మోడీని బ్రహ్మస్త్రంగా చూపిస్తోంది. ప్రతి ఎన్నికలకు కొత్త ప్రభుత్వాన్ని మర్చే సాంప్రదాయం ఉన్న హిమాచలంలో బీజేపీ తనన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మోడీనే సర్వం.. అన్న మంత్రాన్ని పఠిస్తుండడం గమనార్హం.
మీరెవ్వరినీ చూడాల్సిన అవసరం లేదు. పువ్వు గుర్తుకు వేయండి చాలు. ఆ ఓటు నాకు వేసినట్లే!.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చేసిన అభ్యర్థన ఇది. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి చెమటోడ్చుతున్న బీజేపీకి.. తమ సిద్ధాంతాలతోను.. పనితనంతోనూ పని జరగదని అర్ధమైపోయింది. కేవలం ఓటర్లలో నరేంద్ర మోడీకున్న ఆదరణపైనే అధికంగా ఆధారపడుతోంది. చూస్తుంటే పోటీ ఇక్కడ స్థానిక కాంగ్రెస్కు.. నరేంద్రమోడీకి మధ్య ఉందా? అన్నట్లు పరిస్థితి మారింది.
రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది నేతలున్నా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైనా.. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కించే బాధ్యత పూర్తిగా మోడీపైనే పడిందంటే.. ఒక జాతీయ పార్టీని.. అందునా ఆర్ఎస్ఎస్ మూలాలున్న పార్టీని మోడీ ఎలా శాసిస్తున్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. తిరుగుబాటులతో పాటు విపక్షాలపైనా బీజేపీ తమ బ్రహ్మాస్త్రంగా ప్రధాని నరేంద్రమోడీనే నమ్ముకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆయన కరిష్మాతో గట్టెక్కి.. చరిత్రను తిరగ రాయాలనుకుంటోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు అయితే.. చేయొచ్చు.. కానీ, బీజేపీ జవం.. జీవం.. అనదగిన ఆర్ఎస్ఎస్ పోయి.. మోడీ ఆత్మ అయితే.. మున్ముందు పార్టీకి ప్రయోజనమేనా? అన్నది ఆర్ ఎస్ ఎస్ వాదుల్లో తలెత్తుతున్న ప్రశ్న.
This post was last modified on November 11, 2022 7:22 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…