Political News

జ‌గ‌న్‌-ప‌వ‌న్‌-మోడీ.. ముహూర్తం ఖ‌రారు?!

ఏపీ పొలిటిక‌ల్ హిస్ట‌రీలో ఫ‌స్ట్‌టైం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సీఎం జ‌గ‌న్‌లు ఒకే వేదిక‌ను పంచుకోనున్నారు. రాజ‌కీయంగా క‌త్తులు నూరుకునే ఈ ఇద్ద‌రు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. ఇది అధికారిక కార్య‌క్ర‌మమే అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్‌కు ‘ప్ర‌త్యేక ఆహ్వానం’ అందిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప్ర‌ధాని పాల్గొనే కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని.. కేంద్రం నుంచి ప‌వ‌న్‌కు ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో విశాఖలో ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. శుక్ర‌వారం ప్రధాని విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారని చర్చ జరుగుతోంది. దీంతో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్ పాల్గొంటారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే ఈ భేటీ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్.. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ రానున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ రెండు రోజుల పాటు విశాఖలోనే పవన్ పర్యటిస్తారు. ప్రధాని పర్యటిస్తున్న సమయంలోనే టిడ్కో ఇళ్ల… సోషల్ ఆడిట్ అంశంపై జనసేన ప్రకటన చేయనుండటం విశేషం.

ఇక‌, ప్ర‌ధాని పాల్గొనే కార్య‌క్ర‌మాల్లోనూ ప‌వ‌న్‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో తొలిసారి ప్ర‌ధాని మోడీ, సీఎం జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌లు ఒకే వేదిక‌ను పంచుకునే అద్భుత ఘ‌ట్టం తెర‌మీద‌కు రానుంద‌ని తెలుస్తోంది. ఇక‌, సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం విశాఖకు వెళ్తారు. ప్రధాని విశాఖకు రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇదే కార్య‌క్ర‌మాల‌కు ప‌వ‌న్‌ను కూడా ఆహ్వానించ‌డం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

This post was last modified on November 10, 2022 9:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago