ఈ సోషల్ మీడియా కాలంలో ఫిలిం సెలబ్రెటీలైనా, పొలిటికల్ లీడర్లయినా.. ఏవైనా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేటపుడు కొంచెం ముందు వెనుక ఆలోచించుకోవడం మంచిది. తొందరపడి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత అటు ఇటు అయితే మీడియా వాళ్లు, సోషల్ మీడియా జనాలు వారిని మామూలుగా టార్గెట్ చేయరు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు ముందు చేసిన తొందరపాటు కామెంట్ వల్ల తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 11 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే ఎన్నికలకు ముందు ఒక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు. దీనికి యాంకర్ స్పందిస్తూ.. ఆలోచించే ఈ మాట అంటున్నారా, తర్వాత మేం ఇదే స్టేట్మెంట్ను తిప్పి తిప్పి వేస్తాం, చూస్కోండి మరి అన్నా కూడా రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ సవాలు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు కొంచెం పెద్ద తేడాతోనే ఓటమి చవిచూశారు.
దీంతో టీఆర్ఎస్ మద్దతుదారులే కాక, బీజేపీ అంటే పడని వాళ్లు, అలాగే కోటమిరెడ్డి సోదరుల వ్యతిరేకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. రాజగోపాల్ రెడ్డీ.. ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావ్? తర్వాత ఏం చేయబోతున్నావ్? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరి దీనికి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on November 6, 2022 10:17 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…