Political News

స‌రైన కేండెట్ ఉంటే.. ఆ సీటు టీడీపీదే..

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంంలో అస‌లు పొలిటికల్ ప‌రిస్థితి బాగో లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీల‌క నాయ‌కుడు.. రాజ‌కీయంగా దూరంగా ఉన్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తంద‌ని.. భావించిన ఆయ‌న‌.. రాక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇత‌రత్రా స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయంగా దూకుడు చూపించ‌లేక పోయారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని ప్లాన్ చేసుకున్నారు.

అయితే.. వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని.. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేసేశారు. దీంతో ఆ నియోజ‌క‌వర్గంలో… స‌ద‌రు ఎమ్మెల్యే త‌ల్ల‌డిల్లుతున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌… నియోజ‌క‌వ‌ర్గం మొహం చూసింది లేదు. కేవ‌లం వార‌సుడిని మాత్ర‌మే రంగంలోకి దింపారు. ఇప్ప‌టికిప్పుడు రంగంలోకి దిగినా.. కేవ‌లం ఏడాదిన్న‌ర స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప‌రిస్థితి లేదు. దీంతో .. ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కొంత మేర‌కు శ్ర‌మిస్తే.. విజ‌యం ద‌క్క‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి..

అదే.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు. నూజివీడులో టీడీపీ ఊపు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు ఇక్క‌డ నుంచి పోటీ చేసి.. గ‌ట్టి పోటీనే ఇచ్చారు. దాదాపు 95 వేల ఓట్ల పైచిలుకు వ‌చ్చాయి. కానీ.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఏదో.. కార్య‌క్ర‌మాల్లో మొక్కుబ‌డిగా పాల్గొంటున్నారు. మ‌రి ఇప్ప‌టి నుంచి ఆయ‌న పుంజుకుంటే.. ఇక్క‌డ గెలిచే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీలకులు చెబుతున్నారు.

వైసీపీ త‌ర‌ఫున గెలిచిన అప్పారావు.. 2014లో ఒకింత ఊపు చూపించారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్య‌మాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయ‌న కుమారుడిని ఇక్క‌డ రంగంలొకి దింపాల‌ని అనుకున్నారు. కానీ,ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. మ‌రి ఈ స‌మ‌యంలో టీడీపీ పుంజుకునేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. గ‌ట్టి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని మాత్రం వారు కోరుతున్నారు. దీనిపై ఇప్ప‌టికే స‌మాచారం సేక‌రించిన చంద్ర‌బాబు.. అభ్య‌ర్థి కోసం వెతుకుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారో.. ఎవ‌రికి టికెట్ ఇస్తారో చూడాలి.

This post was last modified on October 29, 2022 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

32 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago