రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఒక నియోజకవర్గంంలో అసలు పొలిటికల్ పరిస్థితి బాగో లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీలక నాయకుడు.. రాజకీయంగా దూరంగా ఉన్నారు. తనకు మంత్రి పదవి వస్తందని.. భావించిన ఆయన.. రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇతరత్రా సమస్యలతో రాజకీయంగా దూకుడు చూపించలేక పోయారు. పైగా వచ్చే ఎన్నికల్లో వారసుడిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే.. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని.. సీఎం జగన్ స్పష్టం చేసేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో… సదరు ఎమ్మెల్యే తల్లడిల్లుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఆయన… నియోజకవర్గం మొహం చూసింది లేదు. కేవలం వారసుడిని మాత్రమే రంగంలోకి దింపారు. ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగినా.. కేవలం ఏడాదిన్నర సమయంలో నియోజకవర్గం సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదు. దీంతో .. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టీడీపీ కొంత మేరకు శ్రమిస్తే.. విజయం దక్కడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి..
అదే.. నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. నూజివీడులో టీడీపీ ఊపు అస్సలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీ చేసి.. గట్టి పోటీనే ఇచ్చారు. దాదాపు 95 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయి. కానీ.. ఎన్నికల తర్వాత.. ఆయన ఊసు ఎక్కడా వినిపించడం లేదు. ఏదో.. కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. మరి ఇప్పటి నుంచి ఆయన పుంజుకుంటే.. ఇక్కడ గెలిచే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
వైసీపీ తరఫున గెలిచిన అప్పారావు.. 2014లో ఒకింత ఊపు చూపించారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయన కుమారుడిని ఇక్కడ రంగంలొకి దింపాలని అనుకున్నారు. కానీ,ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మరి ఈ సమయంలో టీడీపీ పుంజుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉందని.. పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని మాత్రం వారు కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే సమాచారం సేకరించిన చంద్రబాబు.. అభ్యర్థి కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో.. ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.
This post was last modified on October 29, 2022 7:28 am
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…
‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…
తమిళ సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడి నుంచి వచ్చే అనువాద…
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…