రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఒక నియోజకవర్గంంలో అసలు పొలిటికల్ పరిస్థితి బాగో లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీలక నాయకుడు.. రాజకీయంగా దూరంగా ఉన్నారు. తనకు మంత్రి పదవి వస్తందని.. భావించిన ఆయన.. రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇతరత్రా సమస్యలతో రాజకీయంగా దూకుడు చూపించలేక పోయారు. పైగా వచ్చే ఎన్నికల్లో వారసుడిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే.. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని.. సీఎం జగన్ స్పష్టం చేసేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో… సదరు ఎమ్మెల్యే తల్లడిల్లుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఆయన… నియోజకవర్గం మొహం చూసింది లేదు. కేవలం వారసుడిని మాత్రమే రంగంలోకి దింపారు. ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగినా.. కేవలం ఏడాదిన్నర సమయంలో నియోజకవర్గం సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదు. దీంతో .. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టీడీపీ కొంత మేరకు శ్రమిస్తే.. విజయం దక్కడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి..
అదే.. నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. నూజివీడులో టీడీపీ ఊపు అస్సలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీ చేసి.. గట్టి పోటీనే ఇచ్చారు. దాదాపు 95 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయి. కానీ.. ఎన్నికల తర్వాత.. ఆయన ఊసు ఎక్కడా వినిపించడం లేదు. ఏదో.. కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. మరి ఇప్పటి నుంచి ఆయన పుంజుకుంటే.. ఇక్కడ గెలిచే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
వైసీపీ తరఫున గెలిచిన అప్పారావు.. 2014లో ఒకింత ఊపు చూపించారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయన కుమారుడిని ఇక్కడ రంగంలొకి దింపాలని అనుకున్నారు. కానీ,ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మరి ఈ సమయంలో టీడీపీ పుంజుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉందని.. పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని మాత్రం వారు కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే సమాచారం సేకరించిన చంద్రబాబు.. అభ్యర్థి కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో.. ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.
This post was last modified on October 29, 2022 7:28 am
వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా…
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…