Political News

స‌రైన కేండెట్ ఉంటే.. ఆ సీటు టీడీపీదే..

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంంలో అస‌లు పొలిటికల్ ప‌రిస్థితి బాగో లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీల‌క నాయ‌కుడు.. రాజ‌కీయంగా దూరంగా ఉన్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తంద‌ని.. భావించిన ఆయ‌న‌.. రాక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇత‌రత్రా స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయంగా దూకుడు చూపించ‌లేక పోయారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని ప్లాన్ చేసుకున్నారు.

అయితే.. వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని.. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేసేశారు. దీంతో ఆ నియోజ‌క‌వర్గంలో… స‌ద‌రు ఎమ్మెల్యే త‌ల్ల‌డిల్లుతున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌… నియోజ‌క‌వ‌ర్గం మొహం చూసింది లేదు. కేవ‌లం వార‌సుడిని మాత్ర‌మే రంగంలోకి దింపారు. ఇప్ప‌టికిప్పుడు రంగంలోకి దిగినా.. కేవ‌లం ఏడాదిన్న‌ర స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప‌రిస్థితి లేదు. దీంతో .. ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కొంత మేర‌కు శ్ర‌మిస్తే.. విజ‌యం ద‌క్క‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి..

అదే.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు. నూజివీడులో టీడీపీ ఊపు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు ఇక్క‌డ నుంచి పోటీ చేసి.. గ‌ట్టి పోటీనే ఇచ్చారు. దాదాపు 95 వేల ఓట్ల పైచిలుకు వ‌చ్చాయి. కానీ.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఏదో.. కార్య‌క్ర‌మాల్లో మొక్కుబ‌డిగా పాల్గొంటున్నారు. మ‌రి ఇప్ప‌టి నుంచి ఆయ‌న పుంజుకుంటే.. ఇక్క‌డ గెలిచే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీలకులు చెబుతున్నారు.

వైసీపీ త‌ర‌ఫున గెలిచిన అప్పారావు.. 2014లో ఒకింత ఊపు చూపించారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్య‌మాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయ‌న కుమారుడిని ఇక్క‌డ రంగంలొకి దింపాల‌ని అనుకున్నారు. కానీ,ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. మ‌రి ఈ స‌మ‌యంలో టీడీపీ పుంజుకునేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. గ‌ట్టి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని మాత్రం వారు కోరుతున్నారు. దీనిపై ఇప్ప‌టికే స‌మాచారం సేక‌రించిన చంద్ర‌బాబు.. అభ్య‌ర్థి కోసం వెతుకుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారో.. ఎవ‌రికి టికెట్ ఇస్తారో చూడాలి.

This post was last modified on October 29, 2022 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago