Political News

‘జనసేన జెండాలు చంద్రబాబు పెట్టించాడు’

విశాఖలో పరిణామాల అనంతరం వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలపై పవన్ బూతులతో విరుచుకుపడ్డారు. ఇక అదే సందర్భంలో బిజెపికి ఊడిగం చేయబోమంటూ పవన్ చేసిన ప్రకటన జాతీయ స్థాయిలో బీజేపీ నేతలను ఆలోచనలో పడేసింది. బిజెపి అంటే తమకు గౌరవం ఉందని, అలా అని బిజెపి చెప్పిందే చేయడం సాధ్యం కాదని పవన్ చెప్పడంతో ఏపీ బీజేపీ చీఫ్ సోమ వీర్రాజు కూడా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో భేటీ అయ్యారు.

ఇక, హోటల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టిడిపి అధినేత చంద్రబాబు కలవడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సంచలనం రేపింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేనతో కలిసి ముందుకు వెళ్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తాజాగా జనసేన, టిడిపి వ్యవహారంపై సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో బిజెపి పొత్తు కొనసాగుతుందని సోము అన్నారు. ఇక, ఇటీవల పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టిడిపి-జనసేన జెండాలు కలిసి కనిపించడంపై కూడా సోము స్పందించారు.

ఆ జెడాలను చంద్రబాబు ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని కూడా సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జనసేనతో తప్ప మరో పార్టీతో బిజెపికి పొత్తులేదని సోము స్పష్టం చేశారు. ఏపీ బీజేపీలో కోర్ కమిటీ సమావేశాలను సోమ వీర్రాజు నిర్వహించడం లేదని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు సోమ వీర్రాజు నిరాకరించారు. మరి, తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on October 26, 2022 8:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కల్కి పబ్లిసిటీకి పక్కా ప్రణాళికలు

ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…

1 hour ago

దేవర హుకుమ్ – అనిరుధ్ సలామ్

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…

2 hours ago

ఏపీలో ఎవ‌రు గెలుస్తున్నారు? కేటీఆర్ స‌మాధానం ఇదే!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. తాజాగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితంపై స్పందించారు. ఇంకా ఫ‌లితం…

7 hours ago

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల…

13 hours ago

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…

14 hours ago

ఉండిలో త్రిముఖ పోరు.. ర‌ఘురామ ఫేట్ ఎలా ఉంది?

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరులో అంద‌రినీ ఆక‌ర్షించిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన…

16 hours ago