Political News

రాజమండ్రిలో ఉద్రిక్తత.. రాధా.. ప‌రిటాల‌.. అరెస్టు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త రాత్రి నుంచి(ఆదివారం) ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇక్క‌డ రాజ‌ధారి రైతులు.. నిర్వ‌హిస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 నేడు.. రాజ‌మండ్రిలోకి అడుగు పెట్ట‌నుంది. అయితే.. దీనిని అడ్డుకుని తీరుతామ‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మండ్రి బ్రిడ్జిపై.. రాక‌పోక‌ల‌ను నిషేధించారు. రిపేర్ పేరుతో.. బ్ర‌డ్జిని మూసేశారు. అయిన‌ప్ప‌టికీ.. పాద‌యాత్ర కొన‌సాగించి తీరుతామ‌ని.. అవ‌స‌ర‌మైతే.. ప‌డ‌వ‌ల ద్వారా.. నదిని దాటుతామ‌ని..రైతులు ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు.. టీడీపీ యువ నాయ‌కులు.. ప‌రిటాల‌శ్రీరామ్(అనంత‌పురం), వంగ‌వీటి రాధా(విజ‌య‌వాడ‌), గంటి హ‌రీష్‌(అమ‌లాపురం) వంటివారు.. పాద‌యాత్ర‌లో అడుగులు వేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆదివారం సాయంత్ర‌మే రాజ‌మండ్రికి చేరుకున్న‌వారు ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. అనంత‌రం.. ఈ రోజు ఉద‌యం.. పాద‌యాత్ర‌లో పాల్గొనేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరికి.. టీవీ 5 చైర్మ‌న్ బీఆర్ నాయుడు కూడా.. సంఘీభావం తెలిపారు. వీరంతా.. పాద‌యాత్ర‌కు వెళ్లేందుకు రెడీ కాగా.. పోలీసులు చుట్టుముట్టారు.

పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీసులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు.. కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య‌లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క‌రించి..ఇళ్ల‌లోకి వెళ్లిపోవాల‌ని.. లేక పోతే.. అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో .. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

This post was last modified on October 17, 2022 1:04 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

9 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

10 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

13 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

14 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

14 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

14 hours ago