Political News

రాజమండ్రిలో ఉద్రిక్తత.. రాధా.. ప‌రిటాల‌.. అరెస్టు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త రాత్రి నుంచి(ఆదివారం) ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇక్క‌డ రాజ‌ధారి రైతులు.. నిర్వ‌హిస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 నేడు.. రాజ‌మండ్రిలోకి అడుగు పెట్ట‌నుంది. అయితే.. దీనిని అడ్డుకుని తీరుతామ‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మండ్రి బ్రిడ్జిపై.. రాక‌పోక‌ల‌ను నిషేధించారు. రిపేర్ పేరుతో.. బ్ర‌డ్జిని మూసేశారు. అయిన‌ప్ప‌టికీ.. పాద‌యాత్ర కొన‌సాగించి తీరుతామ‌ని.. అవ‌స‌ర‌మైతే.. ప‌డ‌వ‌ల ద్వారా.. నదిని దాటుతామ‌ని..రైతులు ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు.. టీడీపీ యువ నాయ‌కులు.. ప‌రిటాల‌శ్రీరామ్(అనంత‌పురం), వంగ‌వీటి రాధా(విజ‌య‌వాడ‌), గంటి హ‌రీష్‌(అమ‌లాపురం) వంటివారు.. పాద‌యాత్ర‌లో అడుగులు వేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆదివారం సాయంత్ర‌మే రాజ‌మండ్రికి చేరుకున్న‌వారు ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. అనంత‌రం.. ఈ రోజు ఉద‌యం.. పాద‌యాత్ర‌లో పాల్గొనేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరికి.. టీవీ 5 చైర్మ‌న్ బీఆర్ నాయుడు కూడా.. సంఘీభావం తెలిపారు. వీరంతా.. పాద‌యాత్ర‌కు వెళ్లేందుకు రెడీ కాగా.. పోలీసులు చుట్టుముట్టారు.

పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీసులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు.. కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య‌లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క‌రించి..ఇళ్ల‌లోకి వెళ్లిపోవాల‌ని.. లేక పోతే.. అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో .. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

This post was last modified on October 17, 2022 1:04 pm

Share

Recent Posts

డిజాస్టర్ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌ను దాటేస్తున్నాడు

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ…

4 hours ago

దేశముదురు చేయకపోవడమే మంచిదైంది

ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…

7 hours ago

ఒకటవ తేదీకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…

8 hours ago

ఆదర్శ కుటుంబానికి తమన్ ఎలివేషన్

త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…

10 hours ago

విశ్వనాథ్  వాటిని మ్యాచ్ చేయాల్సిందే

వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…

12 hours ago

జూలై చివరి వారం… OTT ఆప్షన్ల వర్షం

థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…

12 hours ago