Political News

రాజమండ్రిలో ఉద్రిక్తత.. రాధా.. ప‌రిటాల‌.. అరెస్టు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త రాత్రి నుంచి(ఆదివారం) ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇక్క‌డ రాజ‌ధారి రైతులు.. నిర్వ‌హిస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 నేడు.. రాజ‌మండ్రిలోకి అడుగు పెట్ట‌నుంది. అయితే.. దీనిని అడ్డుకుని తీరుతామ‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మండ్రి బ్రిడ్జిపై.. రాక‌పోక‌ల‌ను నిషేధించారు. రిపేర్ పేరుతో.. బ్ర‌డ్జిని మూసేశారు. అయిన‌ప్ప‌టికీ.. పాద‌యాత్ర కొన‌సాగించి తీరుతామ‌ని.. అవ‌స‌ర‌మైతే.. ప‌డ‌వ‌ల ద్వారా.. నదిని దాటుతామ‌ని..రైతులు ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు.. టీడీపీ యువ నాయ‌కులు.. ప‌రిటాల‌శ్రీరామ్(అనంత‌పురం), వంగ‌వీటి రాధా(విజ‌య‌వాడ‌), గంటి హ‌రీష్‌(అమ‌లాపురం) వంటివారు.. పాద‌యాత్ర‌లో అడుగులు వేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆదివారం సాయంత్ర‌మే రాజ‌మండ్రికి చేరుకున్న‌వారు ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. అనంత‌రం.. ఈ రోజు ఉద‌యం.. పాద‌యాత్ర‌లో పాల్గొనేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరికి.. టీవీ 5 చైర్మ‌న్ బీఆర్ నాయుడు కూడా.. సంఘీభావం తెలిపారు. వీరంతా.. పాద‌యాత్ర‌కు వెళ్లేందుకు రెడీ కాగా.. పోలీసులు చుట్టుముట్టారు.

పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీసులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు.. కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య‌లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క‌రించి..ఇళ్ల‌లోకి వెళ్లిపోవాల‌ని.. లేక పోతే.. అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో .. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

This post was last modified on October 17, 2022 1:04 pm

Share
Show comments

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago