ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత రాత్రి నుంచి(ఆదివారం) ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ రాజధారి రైతులు.. నిర్వహిస్తున్న మహాపాదయాత్ర 2.0 నేడు.. రాజమండ్రిలోకి అడుగు పెట్టనుంది. అయితే.. దీనిని అడ్డుకుని తీరుతామని.. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ప్రకటనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి బ్రిడ్జిపై.. రాకపోకలను నిషేధించారు. రిపేర్ పేరుతో.. బ్రడ్జిని మూసేశారు. అయినప్పటికీ.. పాదయాత్ర కొనసాగించి తీరుతామని.. అవసరమైతే.. పడవల ద్వారా.. నదిని దాటుతామని..రైతులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు.. టీడీపీ యువ నాయకులు.. పరిటాలశ్రీరామ్(అనంతపురం), వంగవీటి రాధా(విజయవాడ), గంటి హరీష్(అమలాపురం) వంటివారు.. పాదయాత్రలో అడుగులు వేసేందుకు ముందుకు వచ్చారు. ఆదివారం సాయంత్రమే రాజమండ్రికి చేరుకున్నవారు ఓ హోటల్లో బస చేశారు. అనంతరం.. ఈ రోజు ఉదయం.. పాదయాత్రలో పాల్గొనేందుకు బయటకు వచ్చారు. వీరికి.. టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు కూడా.. సంఘీభావం తెలిపారు. వీరంతా.. పాదయాత్రకు వెళ్లేందుకు రెడీ కాగా.. పోలీసులు చుట్టుముట్టారు.
పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పోలీసుల అడ్డును తప్పించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీసులు అరెస్టులు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నాయకుడు.. కోనేరు మురళి ఇంటి వద్ద నుంచి బయలు దేరిన వంగవీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్యకర్తలు సైతం.. భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు తమకు సహకరించి..ఇళ్లలోకి వెళ్లిపోవాలని.. లేక పోతే.. అరెస్టులు తప్పవని హెచ్చరించారు. దీంతో రాజమండ్రి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో .. అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
This post was last modified on October 17, 2022 1:04 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…