Political News

రాజమండ్రిలో ఉద్రిక్తత.. రాధా.. ప‌రిటాల‌.. అరెస్టు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త రాత్రి నుంచి(ఆదివారం) ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇక్క‌డ రాజ‌ధారి రైతులు.. నిర్వ‌హిస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 నేడు.. రాజ‌మండ్రిలోకి అడుగు పెట్ట‌నుంది. అయితే.. దీనిని అడ్డుకుని తీరుతామ‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మండ్రి బ్రిడ్జిపై.. రాక‌పోక‌ల‌ను నిషేధించారు. రిపేర్ పేరుతో.. బ్ర‌డ్జిని మూసేశారు. అయిన‌ప్ప‌టికీ.. పాద‌యాత్ర కొన‌సాగించి తీరుతామ‌ని.. అవ‌స‌ర‌మైతే.. ప‌డ‌వ‌ల ద్వారా.. నదిని దాటుతామ‌ని..రైతులు ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు.. టీడీపీ యువ నాయ‌కులు.. ప‌రిటాల‌శ్రీరామ్(అనంత‌పురం), వంగ‌వీటి రాధా(విజ‌య‌వాడ‌), గంటి హ‌రీష్‌(అమ‌లాపురం) వంటివారు.. పాద‌యాత్ర‌లో అడుగులు వేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆదివారం సాయంత్ర‌మే రాజ‌మండ్రికి చేరుకున్న‌వారు ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. అనంత‌రం.. ఈ రోజు ఉద‌యం.. పాద‌యాత్ర‌లో పాల్గొనేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరికి.. టీవీ 5 చైర్మ‌న్ బీఆర్ నాయుడు కూడా.. సంఘీభావం తెలిపారు. వీరంతా.. పాద‌యాత్ర‌కు వెళ్లేందుకు రెడీ కాగా.. పోలీసులు చుట్టుముట్టారు.

పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీసులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు.. కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య‌లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క‌రించి..ఇళ్ల‌లోకి వెళ్లిపోవాల‌ని.. లేక పోతే.. అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో .. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

42 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago