Political News

ఆ బ్రిడ్జి మూసివేస్తూ నిర్ణయం… పాదయాత్రే టార్గెట్టా?

రాజమహేంద్రవరం అన్నంతనే గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయటం.. రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు తూర్పుగోదావరి కలెక్టర్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమ వాదనకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రను ఇప్పటికే పెయిడ్ పాదయాత్రగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకత్వం.. తాజాగా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు సైతం రోడ్ల మీదకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇప్పటికే తెర మీదకు రావటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తమ పాదయాత్రకు ఇబ్బందులు పెట్టేలా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయటంతో తమకు కాస్త సమస్యగా మారినా.. తమ షెడ్యూల్ మాత్రం మారదని స్పష్టం చేస్తున్నారు. రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ మీద రాకపోకల్ని నిలిపివేయటం కారణంగా.. మహా అయితే పాదయాత్ర మరో రెండు రోజులు టైం పెరుగుతుందే తప్పించి మరింకేమీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. తాము అనుకున్న మార్గంలోనే పాదయాత్రను కొనసాగుతుందని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 17న బ్రిడ్జ్ మీద నుంచి అమరావతి రైతుల పాదయాత్రను వెళ్లనుంది.

పాదయాత్రను టార్గెట్ చేస్తూ.. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మీద రాకపోకల్ని నిలిపివేసిన కారణంగా స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. వంతెన రిపేర్ల కారణంగా రాకపోకల్ని మూసివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పాదయాత్రను అడ్డుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఆ వాదనకు బలం చేకూరేలా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న కొద్దీ పాదయాత్ర చేస్తున్న వారిలో పట్టుదల పెంచటంతో పాటు.. ప్రజల్లోనూ సానుభూతి వ్యక్తమవుతుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

50 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago