రాజమహేంద్రవరం అన్నంతనే గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయటం.. రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు తూర్పుగోదావరి కలెక్టర్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమ వాదనకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రను ఇప్పటికే పెయిడ్ పాదయాత్రగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకత్వం.. తాజాగా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు సైతం రోడ్ల మీదకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇప్పటికే తెర మీదకు రావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తమ పాదయాత్రకు ఇబ్బందులు పెట్టేలా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయటంతో తమకు కాస్త సమస్యగా మారినా.. తమ షెడ్యూల్ మాత్రం మారదని స్పష్టం చేస్తున్నారు. రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ మీద రాకపోకల్ని నిలిపివేయటం కారణంగా.. మహా అయితే పాదయాత్ర మరో రెండు రోజులు టైం పెరుగుతుందే తప్పించి మరింకేమీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. తాము అనుకున్న మార్గంలోనే పాదయాత్రను కొనసాగుతుందని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 17న బ్రిడ్జ్ మీద నుంచి అమరావతి రైతుల పాదయాత్రను వెళ్లనుంది.
పాదయాత్రను టార్గెట్ చేస్తూ.. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మీద రాకపోకల్ని నిలిపివేసిన కారణంగా స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. వంతెన రిపేర్ల కారణంగా రాకపోకల్ని మూసివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పాదయాత్రను అడ్డుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఆ వాదనకు బలం చేకూరేలా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న కొద్దీ పాదయాత్ర చేస్తున్న వారిలో పట్టుదల పెంచటంతో పాటు.. ప్రజల్లోనూ సానుభూతి వ్యక్తమవుతుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 14, 2022 2:39 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…