Political News

ఆ బ్రిడ్జి మూసివేస్తూ నిర్ణయం… పాదయాత్రే టార్గెట్టా?

రాజమహేంద్రవరం అన్నంతనే గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయటం.. రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు తూర్పుగోదావరి కలెక్టర్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమ వాదనకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రను ఇప్పటికే పెయిడ్ పాదయాత్రగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకత్వం.. తాజాగా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు సైతం రోడ్ల మీదకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇప్పటికే తెర మీదకు రావటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తమ పాదయాత్రకు ఇబ్బందులు పెట్టేలా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయటంతో తమకు కాస్త సమస్యగా మారినా.. తమ షెడ్యూల్ మాత్రం మారదని స్పష్టం చేస్తున్నారు. రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ మీద రాకపోకల్ని నిలిపివేయటం కారణంగా.. మహా అయితే పాదయాత్ర మరో రెండు రోజులు టైం పెరుగుతుందే తప్పించి మరింకేమీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. తాము అనుకున్న మార్గంలోనే పాదయాత్రను కొనసాగుతుందని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 17న బ్రిడ్జ్ మీద నుంచి అమరావతి రైతుల పాదయాత్రను వెళ్లనుంది.

పాదయాత్రను టార్గెట్ చేస్తూ.. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మీద రాకపోకల్ని నిలిపివేసిన కారణంగా స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. వంతెన రిపేర్ల కారణంగా రాకపోకల్ని మూసివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పాదయాత్రను అడ్డుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఆ వాదనకు బలం చేకూరేలా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న కొద్దీ పాదయాత్ర చేస్తున్న వారిలో పట్టుదల పెంచటంతో పాటు.. ప్రజల్లోనూ సానుభూతి వ్యక్తమవుతుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on October 14, 2022 2:39 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

14 minutes ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

2 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

4 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

8 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

10 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

10 hours ago