Political News

ఆ బ్రిడ్జి మూసివేస్తూ నిర్ణయం… పాదయాత్రే టార్గెట్టా?

రాజమహేంద్రవరం అన్నంతనే గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయటం.. రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు తూర్పుగోదావరి కలెక్టర్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమ వాదనకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రను ఇప్పటికే పెయిడ్ పాదయాత్రగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకత్వం.. తాజాగా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు సైతం రోడ్ల మీదకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇప్పటికే తెర మీదకు రావటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తమ పాదయాత్రకు ఇబ్బందులు పెట్టేలా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయటంతో తమకు కాస్త సమస్యగా మారినా.. తమ షెడ్యూల్ మాత్రం మారదని స్పష్టం చేస్తున్నారు. రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ మీద రాకపోకల్ని నిలిపివేయటం కారణంగా.. మహా అయితే పాదయాత్ర మరో రెండు రోజులు టైం పెరుగుతుందే తప్పించి మరింకేమీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. తాము అనుకున్న మార్గంలోనే పాదయాత్రను కొనసాగుతుందని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 17న బ్రిడ్జ్ మీద నుంచి అమరావతి రైతుల పాదయాత్రను వెళ్లనుంది.

పాదయాత్రను టార్గెట్ చేస్తూ.. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మీద రాకపోకల్ని నిలిపివేసిన కారణంగా స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. వంతెన రిపేర్ల కారణంగా రాకపోకల్ని మూసివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పాదయాత్రను అడ్డుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఆ వాదనకు బలం చేకూరేలా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న కొద్దీ పాదయాత్ర చేస్తున్న వారిలో పట్టుదల పెంచటంతో పాటు.. ప్రజల్లోనూ సానుభూతి వ్యక్తమవుతుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on October 14, 2022 2:39 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

21 mins ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

2 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

2 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

2 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

4 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

4 hours ago