వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొంత కాలానికి ఆయనతో ఈనాడు పత్రిక యుద్ధం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ను కూడా ఈనాడు గట్టిగానే టార్గెట్ చేసింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత, 2014 ఎన్నికలయ్యాక ఆ పత్రిక దూకుడు తగ్గిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ‘ఈనాడు’ మరీ సాత్వికంగా తయారవడం చాలా మందికి రుచించలేదు.
ఐతే గత కొన్ని నెలల్లో ‘ఈనాడు’ తీరే మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తీరు శ్రుతి మించిపోవడం, అదే పనిగా తమను కూడా జగన్ అండ్ కో టార్గెట్ చేస్తుండడంతో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి ఈనాడు అధినేత రామోజీ రావు సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. మళ్లీ వైఎస్ రోజులను గుర్తుకు తెస్తూ ఆ పత్రిక జగన్ అండ్ గ్యాంగ్ను చాలా గట్టిగా టార్గెట్ చేస్తోంది ఈనాడు. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి వైకాపా అగ్ర నేత విజయసాయిరెడ్డితో ఈనాడు పోరు రసవత్తరంగా సాగుతోంది.
విజయసాయి కూతురు, అల్లుడు విశాఖపట్నంలో గత ఏడాదిగా భారీగా భూములు కొనడం గురించి మూడు రోజుల కిందట ఈనాడు పూర్తి ఆధారాలతో ప్రచురించిన కథనం సంచలనం రేపింది. రెండు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈనాడు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విజయసాయి. కానీ ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పిన తీరు తుస్సుమనిపించింది. కాగా ఈ ప్రెస్ మీట్లో విజయసాయి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దసపల్లా భూముల డెవలప్మెంట్కు సంబంధించి తాను 71 శాతం వాటా తీసుకుని, యజమానులకు 29 శాతం మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబడుతున్న వారు.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూర్మనపాలెంలో యజమానులకు 1 శాతం మాత్రమే వాటా ఇచ్చి, డెవలపర్ (ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ) 99 శాతం వాటా తీసుకోవడాన్ని ప్రశ్నించరేంటి అని విజయసాయి ప్రెస్ మీట్లో అడిగారు.
ఎంపీ మాటను పట్టుకునే ‘ఈనాడు’ ఈ వ్యవహారం మీద గురువారం మరో కథనం ప్రచురించింది. ఎంవీవీ వ్యవహారం మొత్తాన్ని బట్టబయలు చేసింది. అందులో ‘సాయిరెడ్డి సౌజన్యంతో’ అంటూ ఒక హెడ్డింగ్ పెట్టి ఒక బాక్స్ ఐటెం ఇచ్చింది. విజయసాయి ఇచ్చిన సమాచారంతోనే ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశామని.. విజయసాయి చెప్పినట్లు ఇందులో భూ యజమానుల వాటా 1 శాతం కూడా లేదని.. 0.96 శాతమే అంటూ ఎంతో వ్యంగ్యంగా ఎంవీవీ దందా గురించి విశ్లేషించింది ‘ఈనాడు’. ఈ కథనం చూసి ఈనాడు ర్యాగింగ్ మామూలుగా లేదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on October 13, 2022 12:10 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…