ముందస్తు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు తరచూ చెప్పేవారు. అయితే ఎందుకనో కొంతకాలంగా ముందస్తు ఎన్నికల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. మరిలాంటి నేపధ్యంలోనే చంద్రబాబు మళ్ళీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు పట్టుకొచ్చారో అర్ధంకావటం లేదు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని అభ్యర్థులు తమ పనితీరు ద్వారా కల్పించాలన్నారు. అలా కల్పించలేకపోతే భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి నేత కూడా తనకు టికెట్ ఇస్తే మాత్రమే పార్టీ గెలుస్తుందని చెప్పుకోవటం చాలా సహజం. అలాగే వాళ్ళ మద్దతుదారులు కూడా తమ నేతకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం మామూలే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని ఆశావహులు ఎలా కల్పించారో అర్ధంకావటం లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పార్టీలో నేతల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. కాబట్టి తనకొచ్చే ఫీడ్ బ్యాక్ ప్రకారమే అభ్యర్ధులను ఫైనల్ చేస్తారనటంలో సందేహంలేదు.
ఇక ముందస్తు ఎన్నికల ముచ్చట చూస్తే పార్టీ అందుకు సిద్ధంగా ఉందా అన్నది కీలకం. రెగ్యులర్ గా నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల పర్యటనలు, సమీక్షల సందర్భంగా 40 నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఫైనల్ చేశారు. అంటే దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేయాల్సుంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు తప్పదంటున్నారు. మరి ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు ? మిగిలినవి ఎన్ని అనేది కీలకమైన పాయింట్. ఇది తేలితే ముందస్తు ఎన్నికలకు రెడీ అవటం తేలికే.
This post was last modified on October 13, 2022 10:56 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…