విజయదశమి నాడు సీఎం కేసీఆర్ తాను పెట్టబోతోన్న జాతీయ పార్టీ పేరు ప్రకటించారు. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేషరతుగా బలపర్చారు. కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.
పార్టీ జెండా గతంలో మాదిరిగానే గులాబీ రంగులోనే ఉండనుంది. దాదాపుా పాత జెండాతోనే కొనసాగేందుకు ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారు ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ రిక్వెస్ట్ చేయనున్నారు. ఉత్తరాదివారిని కూడా దృష్టిలో ఉంచుకొని భారత్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టారు. 2001లో పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలో టీఆర్ఎస్ ను ప్రాంతీయ పార్టీగానే పేర్కొన్నారు. అందుకే, ఇపుడు పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీఆర్ఎస్ పంపనుంది.
తెలంగాణలో టీఆర్ఎస్ సభ్యత్వం బీఆర్ఎస్ కు సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల మద్దతు తమకుందని, ఆదరణ లభిస్తుందని కేసీఆర్ అన్నారు. పార్టీ నేతలకు జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు వస్తాయని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఇన్చార్జులుగా, గవర్నర్లుగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పారు..
This post was last modified on October 5, 2022 2:41 pm
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…