Political News

వైఎస్సార్.. గొర్రెల కాప‌రి.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రానికి ప‌ని చేసిన గొప్ప ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి పేరుంది. ఆయ‌న్ని గొప్ప మాన‌వ‌తావాదిగా అభివ‌ర్ణిస్తారు చాలామంది. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లూ ఇస్తారు స‌న్నిహితులు.

ఇప్పుడు వైకాపా మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో యాంటీగా మారిపోయిన ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వైఎస్ గురించి ఇలాంటి మంచి విష‌యాలు కొన్ని చెప్పారు. బుధ‌వారం వైఎస్ జ‌యంతి నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో వైఎస్ పెద్ద మ‌న‌సు చాటుకున్న ఓ ఉదంతాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

‘‘2004లో వైఎస్‌ గెలిచిన తర్వాత పాదయాత్రకు సంబంధించి ఓ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులో ప్రతి ఫొటోల్లో ఓ వ్యక్తి ఉండటాన్ని వైఎస్సార్ గమనించి ఆయన్ను ట్రేస్ చేసి తీసుకురావాలని పోలీసులకు సూచించారు. వెంటనే వారు తీసుకొచ్చారు. ‘ఏమయ్యా ప్రతి ఫొటోలో ఉన్నావు.. ఒక్కసారి కూడా కనిపించలేదు’ అని వైఎస్సార్ అడిగితే.. ‘నేనో గొర్రెల కాపరిని సార్. ఉన్న గొర్రెలు అమ్మేసి మీతో పాటు నడిచాను. మీతో మాట్లాడేందుకు ధైర్యం చాల్లేదు’ అని చెప్పాడు. వెంటనే వైఎస్సార్ ఆయనకు రూ. 5 లక్షలు డబ్బు ఇచ్చి, 50 గొర్రెలు తీసివ్వాలని పక్కనున్న వారికి చెప్పారు. నీకు ఇక ఏ కష్టమొచ్చినా నేనున్నాని గుర్తుంచుకో అన్నారు.. అంతటి గొప్ప మనిషి వైఎస్సార్’’ అంటూ వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని ఎంపీ రఘురామ ‌కృష్ణ‌రాజు గుర్తు చేసుకున్నారు.

This post was last modified on July 8, 2020 9:06 am

Share
Show comments
Published by
Satya
Tags: YSR

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago