ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి పని చేసిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఒకరిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేరుంది. ఆయన్ని గొప్ప మానవతావాదిగా అభివర్ణిస్తారు చాలామంది. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలూ ఇస్తారు సన్నిహితులు.
ఇప్పుడు వైకాపా మీద విమర్శలు, ఆరోపణలతో యాంటీగా మారిపోయిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వైఎస్ గురించి ఇలాంటి మంచి విషయాలు కొన్ని చెప్పారు. బుధవారం వైఎస్ జయంతి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో వైఎస్ పెద్ద మనసు చాటుకున్న ఓ ఉదంతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘‘2004లో వైఎస్ గెలిచిన తర్వాత పాదయాత్రకు సంబంధించి ఓ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులో ప్రతి ఫొటోల్లో ఓ వ్యక్తి ఉండటాన్ని వైఎస్సార్ గమనించి ఆయన్ను ట్రేస్ చేసి తీసుకురావాలని పోలీసులకు సూచించారు. వెంటనే వారు తీసుకొచ్చారు. ‘ఏమయ్యా ప్రతి ఫొటోలో ఉన్నావు.. ఒక్కసారి కూడా కనిపించలేదు’ అని వైఎస్సార్ అడిగితే.. ‘నేనో గొర్రెల కాపరిని సార్. ఉన్న గొర్రెలు అమ్మేసి మీతో పాటు నడిచాను. మీతో మాట్లాడేందుకు ధైర్యం చాల్లేదు’ అని చెప్పాడు. వెంటనే వైఎస్సార్ ఆయనకు రూ. 5 లక్షలు డబ్బు ఇచ్చి, 50 గొర్రెలు తీసివ్వాలని పక్కనున్న వారికి చెప్పారు. నీకు ఇక ఏ కష్టమొచ్చినా నేనున్నాని గుర్తుంచుకో అన్నారు.. అంతటి గొప్ప మనిషి వైఎస్సార్’’ అంటూ వైఎస్సార్తో తనకున్న అనుబంధాన్ని ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తు చేసుకున్నారు.
This post was last modified on July 8, 2020 9:06 am
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…