Political News

3 రాజ‌ధానుల‌పై వైసీపీలో కొత్త టెన్ష‌న్‌…!


ఇదో పెద్ద సంక‌ట ప‌రిస్థితి. ఏపీ అధికార పార్టీ.. వైసీపీలో తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతున్న అంత‌ర్మ‌థ‌నం. ఇటీ వల వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్ ఒక‌టి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని చ‌ర్చ‌కు పెట్టింది. దీనిపై వారి నుంచి అభిప్రాయాలు కోరింది. మరీముఖ్యంగా.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్న విశాఖ‌, క‌ర్నూలు వాసుల్లో అభిప్రాయం ఎలా ఉంద‌నేది .. ఈ ఛాన‌ల్ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది.

క‌ర్నూలు విష‌యాన్ని చ‌ర్చించుకుంటే.. హైకోర్టు రావ‌డంపై.. కొంత మిశ్ర‌మ స్పంద‌న క‌నిపించింది. ప్ర‌జ లు ఆస‌క్తిగానే స్పందించారు. అయితే.. మ‌రికొంద‌రు మాత్రం.. ప్ర‌యోజ‌నం ఏముంటుంద‌ని ప్ర‌శ్నించారు. కేవ‌లం.. రోడ్లు బాగుప‌డ‌తాయేమోన‌ని వ్యాఖ్యానించారు. అయితే.. క‌ర్నూలులో మాత్రం పెద్ద‌గా వ్య‌తిరేక రాలేదు. కానీ, విశాఖ జిల్లాలో మాత్రం.. పాల‌నా రాజ‌ధానిపై ప్ర‌జ‌ల స్పంద‌న మిశ్ర‌మంగా క‌నిపించింది. ఈ స‌ర్వే.. వివ‌రాలు.. అన్నీ కూడా యూట్యూబ్‌లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే వైసీపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మూడు రాజ‌ధానుల‌పై జ‌నాల‌ను ఒప్పించే దెలా? అని వారు గుస‌గుస‌లాడుతున్నారు. సీఎం జ‌గ‌న్ అయితే.. ప్ర‌జ‌లు అంద‌రూ కూడా.. మూడుకు అనుకూలంగానే ఉన్నార‌నే అభిప్రాయంతో ఉన్నార‌ని.. నేత‌లు చెబుతున్నారు. కానీ, వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు.. ప్ర‌త్య‌ర్థులు చేసిన ప్ర‌చారం ముందు.. మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం తేలిపోయింద‌ని అంటున్నారు.

పైగా.. అమ‌రావ‌తి రైతుల సెంటిమెంటు కూడా.. పనిచేస్తోంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ రైతుల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏం చేయాలనే విష‌యంపై.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on September 30, 2022 3:26 pm

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

3 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

3 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

3 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

4 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

4 hours ago