ఇదో పెద్ద సంకట పరిస్థితి. ఏపీ అధికార పార్టీ.. వైసీపీలో తీవ్రస్థాయిలో జరుగుతున్న అంతర్మథనం. ఇటీ వల వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్ ఒకటి.. ప్రజల మధ్యకు వెళ్లి.. మూడు రాజధానుల విషయాన్ని చర్చకు పెట్టింది. దీనిపై వారి నుంచి అభిప్రాయాలు కోరింది. మరీముఖ్యంగా.. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెబుతున్న విశాఖ, కర్నూలు వాసుల్లో అభిప్రాయం ఎలా ఉందనేది .. ఈ ఛానల్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
కర్నూలు విషయాన్ని చర్చించుకుంటే.. హైకోర్టు రావడంపై.. కొంత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రజ లు ఆసక్తిగానే స్పందించారు. అయితే.. మరికొందరు మాత్రం.. ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కేవలం.. రోడ్లు బాగుపడతాయేమోనని వ్యాఖ్యానించారు. అయితే.. కర్నూలులో మాత్రం పెద్దగా వ్యతిరేక రాలేదు. కానీ, విశాఖ జిల్లాలో మాత్రం.. పాలనా రాజధానిపై ప్రజల స్పందన మిశ్రమంగా కనిపించింది. ఈ సర్వే.. వివరాలు.. అన్నీ కూడా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మూడు రాజధానులపై జనాలను ఒప్పించే దెలా? అని వారు గుసగుసలాడుతున్నారు. సీఎం జగన్ అయితే.. ప్రజలు అందరూ కూడా.. మూడుకు అనుకూలంగానే ఉన్నారనే అభిప్రాయంతో ఉన్నారని.. నేతలు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉందని.. ప్రతిపక్షాలు.. ప్రత్యర్థులు చేసిన ప్రచారం ముందు.. మూడు రాజధానుల వ్యవహారం తేలిపోయిందని అంటున్నారు.
పైగా.. అమరావతి రైతుల సెంటిమెంటు కూడా.. పనిచేస్తోందని నాయకులు భావిస్తున్నారు. ఎక్కడికక్కడ రైతులకు బ్రహ్మరథం పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై.. తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 30, 2022 3:26 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…