ఇదో పెద్ద సంకట పరిస్థితి. ఏపీ అధికార పార్టీ.. వైసీపీలో తీవ్రస్థాయిలో జరుగుతున్న అంతర్మథనం. ఇటీ వల వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్ ఒకటి.. ప్రజల మధ్యకు వెళ్లి.. మూడు రాజధానుల విషయాన్ని చర్చకు పెట్టింది. దీనిపై వారి నుంచి అభిప్రాయాలు కోరింది. మరీముఖ్యంగా.. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెబుతున్న విశాఖ, కర్నూలు వాసుల్లో అభిప్రాయం ఎలా ఉందనేది .. ఈ ఛానల్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
కర్నూలు విషయాన్ని చర్చించుకుంటే.. హైకోర్టు రావడంపై.. కొంత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రజ లు ఆసక్తిగానే స్పందించారు. అయితే.. మరికొందరు మాత్రం.. ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కేవలం.. రోడ్లు బాగుపడతాయేమోనని వ్యాఖ్యానించారు. అయితే.. కర్నూలులో మాత్రం పెద్దగా వ్యతిరేక రాలేదు. కానీ, విశాఖ జిల్లాలో మాత్రం.. పాలనా రాజధానిపై ప్రజల స్పందన మిశ్రమంగా కనిపించింది. ఈ సర్వే.. వివరాలు.. అన్నీ కూడా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మూడు రాజధానులపై జనాలను ఒప్పించే దెలా? అని వారు గుసగుసలాడుతున్నారు. సీఎం జగన్ అయితే.. ప్రజలు అందరూ కూడా.. మూడుకు అనుకూలంగానే ఉన్నారనే అభిప్రాయంతో ఉన్నారని.. నేతలు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉందని.. ప్రతిపక్షాలు.. ప్రత్యర్థులు చేసిన ప్రచారం ముందు.. మూడు రాజధానుల వ్యవహారం తేలిపోయిందని అంటున్నారు.
పైగా.. అమరావతి రైతుల సెంటిమెంటు కూడా.. పనిచేస్తోందని నాయకులు భావిస్తున్నారు. ఎక్కడికక్కడ రైతులకు బ్రహ్మరథం పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై.. తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 30, 2022 3:26 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…