జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ పోలీసులకు సూటిగా ఒక ప్రశ్న సంధించారు. ఈ క్రమంలో పవన్ ప్రశ్నకు.. ఆన్సర్ ఉందా? పోలీసులూ.. అంటూ.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్.. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. న్యాయమూర్తులను కించపరిచినవారిని ఎందుకు అరెస్ట్ చేయరని నిలదీశారు. పోలీసులకు చేతకాదా? అని ప్రశ్నించారు. దీనిపైనే నెటిజన్లు.. పోలీసులను నిలదీస్తున్నారు. మరి పవన్ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
గన్నవరం ఎయిర్పోర్ట్లో బంగారం స్మగ్లింగ్కు సంబంధించిన.. వార్తను జర్నలిస్టుల గ్రూప్లో పోస్ట్ చేశారని పవన్ అన్నారు. అరెస్టు, కుట్రపూరిత నేరం కింద సెక్షన్ల నమోదు చూస్తుంటే.. జగన్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని అనిపిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్ చేశారంటూ 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి సివిల్ డ్రెస్లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచారు. అయితే గురువారం రాత్రి 11.30 గంటల వరకూ అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అరెస్టు చేసినట్లుగానీ సీఐడీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. జర్నలిస్ట్ అంకబాబుకు గుంటూరు సీఐడీ కోర్టులో ఊరట లభించింది.
గురువారం విజయవాడలో అంకబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు… ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అంకబాబును రిమాండ్కు తరలించాలని సీఐడీ న్యాయవాదుల వాదనలు వినిపించగా.. రిమాండ్ రిపోర్ట్ను న్యాయమూర్తి తిరస్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. ఈ పరిణామాలపైనే.. పవన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులను.. రాజకీయ నేతలను అరెస్టు చేస్తున్న ఈజీగా..హై కోర్టు న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన వారిని కూడా అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. దీనినే.. నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సీఐడీ అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…