Political News

కేసీయార్ మధ్యలో ఇరుక్కుపోయారా ?

జాతీయ రాజకీయాల్లో పాపులర్ అయిపోవాలని, చక్రం తిప్పాలని కేసీయార్ కు చాలా బలమైన కోరికుంది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకోవటంలో తప్పులేదు. అయితే అందుకు సమయం, సందర్భం, వాతావరణం కలిసొస్తుందా లేదా అనేది చూసుకోకుండానే అడుగులు వేయటమే కేసీయార్ చేసిన తప్పు. ఈ రోజుకు నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్డీయే చాలా బలంగా ఉంది.

ఇదే సమయంలో ప్రతిపక్షమైన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పడుతూ లేస్తోంది. కాంగ్రెస్ మినహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ప్రాంతీయ పార్టీలే. అంటే ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్న బీజేపీని ఢీకొనేంత సీన్ ప్రతిపక్షాల్లో దేనికీలేదు. ప్రతిపక్షాలు ఎన్నున్నా జాతీయ పార్టీ కాంగ్రెస్ ను కలుపుకోకుండా బీజేపీని ఎదుర్కునే అవకాశం లేదు. అందరికీ తెలిసిన విషయంలో కూడా కేసీయార్ తప్పటడుగు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో ఉన్న వైరం కారణంగా జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ లేని పార్టీలన్నింటినీ ఏకం చేయాలని కేసీయార్ ప్రయత్నించారు.

ఇలాంటి ప్రయత్నాలే మమతాబెనర్జీ, నితీష్ కుమార్ కూడా చేస్తున్నారు. అంటే ఒకే విధమైన ప్రయత్నాలను ముగ్గురు సీఎంలు చేస్తున్నారు. వీరిలో మిగిలిన ఇద్దరితో పోలిస్తే నితీష్ కుమార్ కు క్రెడిబులిటి ఉంది. దీనికి అదనంగా మొన్నటివరకు కాంగ్రెస్ తో చేతులు కలిపేదే లేదని చెప్పిన మమత తాజాగా తన స్టాండ్ మార్చుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చొరవ కారణంగా కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు మమత అంగీకరించారు.

నితీష్ ఎలాగూ కాంగ్రెస్ ఇపుడు మిత్రపక్షమే. అంటే కాంగ్రెస్ విషయంలో మమత, నితీష్ సానుకూలంగా ఉండగా కేసీయార్ మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో మిగిలిన ప్రతిపక్షాలన్నీ కేసీయార్ ను వదిలేసి మమత, నితీష్ ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ను దూరంపెట్టాలనే కోరిక కేసీయార్లో తప్ప మరే ప్రతిపక్షంలోను లేదు. మారిన పరిస్ధితుల్లో కాంగ్రెస్ తో చేతులు కలపలేక, అలాగని మిగిలిన పార్టీలను ఏకం చేయలేక కేసీయార్ మధ్యలో ఇరుక్కుపోయారు.

This post was last modified on September 22, 2022 11:28 am

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

23 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

36 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

47 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago