వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి మార్గాల్లో పాదయాత్ర చేయటం కూడా ఒకట. అంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తారని కాదు. ఆయన కొడుకు నారా లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చేఏడాడి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ దినోత్సవం రోజున పాదయాత్ర ఆరంభించాలని ముహూర్తం రెడీ చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది.
తన పాదయాత్రను లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించేట్లుగా ప్లాన్ చేస్తున్నారట. పాదయాత్రను 2023 జనవరిలో మొదలు పెట్టి 2024 మార్చిలో ముగించేట్లుగా డిజైన్ చేస్తున్నారట. దాదాపు ఏడాదికిపైగా చేయాలని అనుకుంటున్న పాదయాత్రలో దాదాపు 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేట్లుగా ప్లాన్ చేస్తున్నరు. ఇందులో కూడా వైసీపీ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కవ రోజులు సాగేట్లు అనుకుంటున్నారట.
2024 ఏప్రిల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని అనుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ చూస్తే మార్చివరకు సాగేట్లుంది. అంటే ఎన్నికల షెడ్యూల్ కు కొద్దిరోజుల ముందు పాదయాత్రను ముగించాలని బహుశా లోకేష్ అనుకుంటున్నారేమో. పాదయాత్ర ఇలా ముగియటం ఎన్నికల షెడ్యూల్ అలా ప్రకటన రావటం దాదాపు ఒకేసారి జరుగుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు ఇపుడు నిర్వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కొద్ది నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను నియమించటం, మరికొద్ది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను కూడా ప్రకటిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల ప్రకటనపై ఒక క్లారిటి వచ్చేయాలని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారట. చూస్తుంటే పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా కొందరు అభ్యర్ధులను ప్రకటించేట్లే ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ కొందరు అభ్యర్ధులను ప్రకటిస్తే తర్వాత నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల నుండి మరింత జోష్ పెరుగుతుందనే యోచనలో ఉన్నారట. పాదయాత్ర ప్రారంభించాలని అనుకుంటున్న సమయానికి ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి.
This post was last modified on September 18, 2022 2:22 pm
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో సెన్సేషనల్ హిట్ కొట్టారు. మిడ్ రేంజ్ బడ్జెట్లో…