వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి మార్గాల్లో పాదయాత్ర చేయటం కూడా ఒకట. అంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తారని కాదు. ఆయన కొడుకు నారా లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చేఏడాడి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ దినోత్సవం రోజున పాదయాత్ర ఆరంభించాలని ముహూర్తం రెడీ చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది.
తన పాదయాత్రను లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించేట్లుగా ప్లాన్ చేస్తున్నారట. పాదయాత్రను 2023 జనవరిలో మొదలు పెట్టి 2024 మార్చిలో ముగించేట్లుగా డిజైన్ చేస్తున్నారట. దాదాపు ఏడాదికిపైగా చేయాలని అనుకుంటున్న పాదయాత్రలో దాదాపు 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేట్లుగా ప్లాన్ చేస్తున్నరు. ఇందులో కూడా వైసీపీ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కవ రోజులు సాగేట్లు అనుకుంటున్నారట.
2024 ఏప్రిల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని అనుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ చూస్తే మార్చివరకు సాగేట్లుంది. అంటే ఎన్నికల షెడ్యూల్ కు కొద్దిరోజుల ముందు పాదయాత్రను ముగించాలని బహుశా లోకేష్ అనుకుంటున్నారేమో. పాదయాత్ర ఇలా ముగియటం ఎన్నికల షెడ్యూల్ అలా ప్రకటన రావటం దాదాపు ఒకేసారి జరుగుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు ఇపుడు నిర్వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కొద్ది నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను నియమించటం, మరికొద్ది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను కూడా ప్రకటిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల ప్రకటనపై ఒక క్లారిటి వచ్చేయాలని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారట. చూస్తుంటే పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా కొందరు అభ్యర్ధులను ప్రకటించేట్లే ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ కొందరు అభ్యర్ధులను ప్రకటిస్తే తర్వాత నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల నుండి మరింత జోష్ పెరుగుతుందనే యోచనలో ఉన్నారట. పాదయాత్ర ప్రారంభించాలని అనుకుంటున్న సమయానికి ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి.
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…