Political News

పాదయాత్ర ఫైనల్ … కుప్పం నుంచే ఆరంభం !

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి మార్గాల్లో పాదయాత్ర చేయటం కూడా ఒకట. అంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తారని కాదు. ఆయన కొడుకు నారా లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చేఏడాడి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ దినోత్సవం రోజున పాదయాత్ర ఆరంభించాలని ముహూర్తం రెడీ చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది.

తన పాదయాత్రను లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించేట్లుగా ప్లాన్ చేస్తున్నారట. పాదయాత్రను 2023 జనవరిలో మొదలు పెట్టి 2024 మార్చిలో ముగించేట్లుగా డిజైన్ చేస్తున్నారట. దాదాపు ఏడాదికిపైగా చేయాలని అనుకుంటున్న పాదయాత్రలో దాదాపు 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేట్లుగా ప్లాన్ చేస్తున్నరు. ఇందులో కూడా వైసీపీ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కవ రోజులు సాగేట్లు అనుకుంటున్నారట.

2024 ఏప్రిల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని అనుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ చూస్తే మార్చివరకు సాగేట్లుంది. అంటే ఎన్నికల షెడ్యూల్ కు కొద్దిరోజుల ముందు పాదయాత్రను ముగించాలని బహుశా లోకేష్ అనుకుంటున్నారేమో. పాదయాత్ర ఇలా ముగియటం ఎన్నికల షెడ్యూల్ అలా ప్రకటన రావటం దాదాపు ఒకేసారి జరుగుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు ఇపుడు నిర్వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

కొద్ది నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను నియమించటం, మరికొద్ది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను కూడా ప్రకటిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల ప్రకటనపై ఒక క్లారిటి వచ్చేయాలని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారట. చూస్తుంటే పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా కొందరు అభ్యర్ధులను ప్రకటించేట్లే ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ కొందరు అభ్యర్ధులను ప్రకటిస్తే తర్వాత నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల నుండి మరింత జోష్ పెరుగుతుందనే యోచనలో ఉన్నారట. పాదయాత్ర ప్రారంభించాలని అనుకుంటున్న సమయానికి ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి.

This post was last modified on September 18, 2022 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago