రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్తీసుకుంటాయనేది చెప్పడం కష్టం. నిన్నటి వరకు ఇక, అయిపో యిందనుకున్న పార్టీలు.. నాయకులు కూడా పుంజుకుంటున్న పరిస్థితి దేశంలోనే కనిపిస్తోంది. ఇక, ఏపీలో నూ.. వ్యూహాత్మక రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. ఎప్పుడూ.. ఎలాంటి సవాళ్లు ..ప్రతిసవాళ్లు చేయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అధికార పార్టీ వైసీపీకి .. గట్టి సవాలే విసిరారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. ఆయన వైసీపీని ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో తనపార్టీలోని ఎమ్మెల్యేలు.. అందరికీ టికెట్ ఇస్తానని.. చంద్రబాబు చెప్పినట్టు తెలిసిం దే. అయితే.. ఇదే సాహసం.. జగన్ చేయగలరా? ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. అందరికీ.. ఆయన టికెట్లు ఇవ్వ గలరా..? అని.. చంద్రబాబు సవాల్ రువ్వారు. నిజానికి.. ఇది అదిరిపోయే సవాలే అని అనుకోవాలి. ఎందు కంటే.. ప్రస్తుతం వైసీపీలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు(సీఎం మినహా). వీరిలో సగంమందికి పైగానే.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయం పార్టీ చేయించిన సర్వేల్లోనూ.. స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలో వారిలో సగం మందికి టికెట్లు ఇవ్వరాదని.. పార్టీ అధిష్టానమే చూస్తోంది. అందుకే.. కొత్తవారి కోసం వెతుకుతోంది. అయితే.. ఇప్పు డు చంద్రబాబు.. చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది. తన పార్టీలో ఉన్న సిట్టింగులు అందరికీ..(అంటే.. పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉన్నవారు) టికెట్లు ఇస్తామని చెప్పారు. ఇక, వైసీపీ లోనూ అందరికీ టికెట్లు ఇచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరినట్టు తెలుస్తోంది.
నిజానికి ఈ విషయం..ఇప్పుడువైసీపీలో మంటలు రేపుతోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు..వైసీపీలో సిట్టింగులు దాదాపు అందరూ.. కూడా.. తాముకష్టపడితే..టికెట్ తమకేననే వాదనను వినిపిస్తున్నారు. ఇక జగన్ కూడా.. వారిని.. మీరు కష్టపడండి.. అంటూ.. చెబుతున్నారు. దీంతో గడపగడప కు తిరుగుతున్నా రు. అయినా కూడా.. ఎన్నికలకు ముందు.. అందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని.. వైసీపీలో నే వినిపి స్తున్న సమయంలో.. చంద్రబాబువిసిరిన సవాల్.. మరింత కుదిపేస్తోంది. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on September 16, 2022 10:14 am
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…