అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోటికొచ్చిన హామీలిచ్చేస్తున్నారు. తన హామీలను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమన్న విషయంపై రాహుల్ కసరత్తు చేశారా లేదా అన్నదే అర్ధం కావటం లేదు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. పరివర్తన్ యాత్రలో గుజరాత్ లోని అహ్మదాబాద్ రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.
అలాగే రైతులకు రుణమాఫీ చేస్తారట. మూడు లక్షల రూపాయల వరకు ప్రతిరైతుకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇంగ్లీషు స్కూళ్ళల్లో అమ్మాయిలకు ఉచిత విద్యను అందిస్తారట. కోవిడ్ కారణంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు రు. 4 లక్షల పరిహారం ఇస్తామన్నారు. 300 యూనిట్ల విద్యుత్ వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి హామీలిచ్చే ముందు మిగిలిన రాష్ట్రాల పరిస్ధితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రు. 500 కే గ్యాస్ సిలిండర్ గుజరాత్ లో మాత్రమే ఇస్తారా ? మరి మిగిలిన రాష్ట్రాల్లోని వినియోగదారుల మాటేమిటి ? రు. 3 లక్షల వరకు ప్రతిరైతుకు రుణమాఫీ చేస్తానన్నారు. మిగిలిన రాష్ట్రాల్లోను రైతులున్నారు కదా. మరి వాళ్ళ రుణాల సంగతి ఏమిటి ? కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు తలా రు. 4 లక్షల పరిహారం ఇస్తామన్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంతోమంది చనిపోయారు కదా మరి వాళ్ళ మాటేమిటి ? అమ్మాయిలకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఉచిత విద్య హామీ కూడా ఉంది. ఇవన్నీ గుజరాత్ కు మాత్రమే పరిమితమైన సమస్యలు కాదు. యావత్ దేశానికి సంబంధించిన సమస్యలు. ప్రాంతీయ పార్టీలు హామీలిచ్చాయంటే ఏదోలే అనుకోవచ్చు. ఇపుడు గుజరాత్ కు ఇచ్చిన హామీలనే రేపు ఇతర రాష్ట్రాల్లోను ముఖ్యంగా అధికారంలో ఉన్న చత్తీస్ ఘర్, రాజస్ధాన్లో జనాలే డిమాండ్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఏమిచేస్తుంది ?.
This post was last modified on September 6, 2022 6:28 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…