Political News

రాహుల్ హామీలు వర్కవుటవుతాయా?

అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోటికొచ్చిన హామీలిచ్చేస్తున్నారు. తన హామీలను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమన్న విషయంపై రాహుల్ కసరత్తు చేశారా లేదా అన్నదే అర్ధం కావటం లేదు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు.  పరివర్తన్ యాత్రలో గుజరాత్ లోని అహ్మదాబాద్ రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  రు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.

అలాగే రైతులకు రుణమాఫీ చేస్తారట. మూడు లక్షల రూపాయల వరకు ప్రతిరైతుకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇంగ్లీషు స్కూళ్ళల్లో అమ్మాయిలకు ఉచిత విద్యను అందిస్తారట. కోవిడ్ కారణంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు రు. 4 లక్షల పరిహారం ఇస్తామన్నారు. 300 యూనిట్ల విద్యుత్ వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి హామీలిచ్చే ముందు మిగిలిన రాష్ట్రాల పరిస్ధితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రు. 500 కే గ్యాస్ సిలిండర్ గుజరాత్ లో మాత్రమే ఇస్తారా ? మరి మిగిలిన రాష్ట్రాల్లోని వినియోగదారుల మాటేమిటి ? రు. 3 లక్షల వరకు ప్రతిరైతుకు రుణమాఫీ చేస్తానన్నారు. మిగిలిన రాష్ట్రాల్లోను రైతులున్నారు కదా. మరి వాళ్ళ రుణాల సంగతి ఏమిటి ? కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు తలా రు. 4 లక్షల పరిహారం ఇస్తామన్నారు.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంతోమంది చనిపోయారు కదా మరి వాళ్ళ మాటేమిటి ? అమ్మాయిలకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఉచిత విద్య హామీ కూడా ఉంది. ఇవన్నీ గుజరాత్ కు మాత్రమే పరిమితమైన సమస్యలు కాదు. యావత్ దేశానికి సంబంధించిన సమస్యలు. ప్రాంతీయ పార్టీలు హామీలిచ్చాయంటే ఏదోలే అనుకోవచ్చు. ఇపుడు గుజరాత్ కు ఇచ్చిన హామీలనే రేపు ఇతర రాష్ట్రాల్లోను ముఖ్యంగా అధికారంలో ఉన్న చత్తీస్ ఘర్, రాజస్ధాన్లో జనాలే డిమాండ్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఏమిచేస్తుంది ?.

This post was last modified on September 6, 2022 6:28 pm

Share
Show comments

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

45 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

47 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

4 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

9 hours ago