Political News

వైసీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది: చంద్ర‌బాబు

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని..  అందుకే టీడీపీ నేత‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని.. పార్టీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన చెన్నుపాటి గాంధీపై దాడిని చంద్రబాబు ఖండించారు. గాంధీపై దాడి అమానుషమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని, ప్రశాంతంగా ఉన్న విజయవాడను కిష్కింధ‌గా మార్చరని మండిపడ్డారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

గాంధీపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. చెన్నుపాటికి గాంధీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శనివారం విజయవాడలో వైసీపీ నేతల దాడిలో చెన్నుపాటి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్ప్రతిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

ఓడిపోతామనే పిరికితనంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి ఘటన మరొకటి జరిగితే వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన హెచ్చరించారు. కన్నుపొడవడం దుర్మార్గమని ఈ ఘటనలో దోషులకు శిక్ష పడే వరకు న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. విజయవాడలో గతంలో టీడీపీ నేత పట్టాభిపై దాడి చేశారని, ఆ రోజు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చేసిన పని అని, మీ కుటుంబాలకు ఇదే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.

మాకు సొంత అజెండాలేమీ లేవని చంద్ర‌బాబు అన్నారు. టీడీపీ కార్యకర్తలు పోరాడేది ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పైనేనని, తమకు సొంత అజెండాలేమీ లేవని చెప్పారు. వైసీపీ అరాచకాలపై ప్రజల్లో చైతన్యం ప్రారంభమైందని, ప్రతిఘటించి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఎన్నో సంక్షోభాలను చూశామని, దాడులు చేసిన వారిని పతనావస్థకు తీసుకెళ్లిన పార్టీ టీడీపీ అన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి ఘటన ఎమోషన్‌లో జరిగిందని పోలీసులు చెబుతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యారాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

This post was last modified on September 6, 2022 6:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

4 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

4 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

5 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

5 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

6 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

7 hours ago