Political News

అందరికీ బీజేపీ వార్నింగ్ ఇచ్చిందా ?

బీజేపీ అగ్రనాయకత్వం నేతలందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందా ? గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజాసింగ్ ను పార్టీ సస్పెండ్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. సంవత్సరాల తరబడి హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో బీజేపీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఎంఎల్ఏ మాత్రమే అనేట్లుగా ఉండేది. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ గెలిచింది కేవలం గోషామహల్ నియోజకవర్గంలో మాత్రమే.

నియోజకవర్గంలో ఎంఎల్ఏకి అంతటి పట్టుంది. ఎంఐఎం ప్రాబల్యమున్న పాతబస్తీలో రాజాసింగ్ బీజేపీ తరపున గెలవటమంటే మామూలు విషయం కాదు. అంతటి బలమైన నేతనే పార్టీ సస్పెండ్ చేయటం ఆశ్చర్యంగానే ఉంది. కారణం ఏమిటంటే ఎంఎల్ఏ హద్దుదాటమే అని అర్ధమవుతోంది. మహ్మద్ ప్రవక్తపై ఎంఎల్ఏ నోటికొచ్చినట్లు మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంతో ఒక్కసారిగా ముస్లింల్లో అలజడి మొదలైపోయింది. దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ఎంఎల్ఏపై చాలా కేసులు నమోదయ్యాయి.

పరిస్ధితిని గమనించిన పార్టీ అధిష్టానం సమస్య పెద్దదికాకుండా వెంటనే షోకాజ్ నోటీసిచ్చి ఎంఎల్ఏని సస్పెండ్ చేసింది. అసలు పార్టీనుండి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పమంటూ సంజాయిషీ అడిగింది. పార్టీ వైఖరి చూస్తుంటే హద్దుదాటిన నేతలు ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది. చాలామంది నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. చాలామంది నేతలు మాట్లాడే మాటలు, చేసే కామెంట్లు జనాల్లో అనవసరంగా ఉద్రిక్తతలు రేకెత్తించేట్లుగానే ఉంటున్నాయి. అయితే రాజాసింగ్ మాత్రం అన్నీ హద్దులను దాటేశారు.

ఇప్పటికే నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్ధించు కోలేక ఇప్పటికే జాతీయ నాయకత్వం నానా అవస్తలు పడుతోంది. నూపూర్ వివాదం ఇంకా చల్లారక ముందే అవే వ్యాఖ్యలను రాజాసింగ్ కూడా కెలకటంతో పార్టీకి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇపుడు మళ్ళీ సమస్య పెద్దది కాకుండా నూపూర్ ను సస్పెండ్ చేసినట్లే రాజాసింగ్ ను కూడా తక్షణమే సస్పెండ్ చేసి వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తోంది.

This post was last modified on August 24, 2022 5:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago