రాజకీయాల్లో ఉన్న నాయకులు.. ప్రజల నాడినిపట్టుకోవాల్సిందే. ప్రజలను మెప్పించేలా తమ వ్యూహాలు ఉండాలి. ఈ వ్యూహాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. తీవ్రమైన దెబ్బపడిపోతుంది. దీనిని గ్రహించకపోతే. కష్టమే.! ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొన్ని రోజులుగా.. ఒక మాట చెబుతున్నారు. తమ లక్ష్యం.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని! అంటే.. వైసీపీ లేని ఏపీ కావాలని. ఈ లక్ష్యం కోసమే.. వచ్చే ఎన్నికల్లో తాము పనిచేస్తామని అంటున్నారు.
అవసరమైతే.. దీనికోసం.. ఏమైనా చేసేందుకు సిద్ధమేనని ఆయన తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూసుకుంటామని చెప్పారు. అయితే.. వాస్తవానికి ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏ పార్టీకి కూడా ప్రజలు వ్యతిరేకం కాదు.. అనుకూలం అంతకన్నాకాదు. వ్యతిరేకం అయి ఉంటే.. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చేవికావు.. అనుకూలం అయి ఉంటే.. వైసీపీకి కేవలం 151 మాత్రమే దక్కేవి కూడా కావు.
ప్రజలు కోరుకునేది.. కేవలం విధానపరమైన విభేదాలు తొలగించి.. తమకు సుపరిపాలన అందించే ప్రభుత్వమే. ఇలా సుపరిపాలన అందుతుందనే ఆశలతోనే జగన్ను ఆనాడు గెలిపించారు. ఇప్పుడు ఓ వర్గం ప్రజలు మళ్లీ కోరుకుంటున్నది కూడా ఇదే. అంతకు మించి.. వైసీపీ లేకుండా పోవాలని కానీ..జగన్ను లేకుండా చేయాలని కానీ.. ప్రజల ఆకాంక్ష కానేకాదు. ఇది చాలా సున్నితమైన విషయం. దీనిని అర్ధం చేసుకుని.. ప్రజల కోరిక మేరకు.. తన విధివిధానాలను ఖరారు చేసుకోవాల్సిన పవన్.. వైసీపీ విముక్త ఏపీ అంటే.. ఇబ్బందులు ఎదుర్కొనడమేనని అంటున్నారు.
పోనీ.. వైసీపీ విముక్త ఏపీ అంటే.. పూర్తిగా జనసేన ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందా? అంటే.. అది కూడా కష్టమే. ఎందుకంటే.. గత ఎన్నికల్లోనే 175స్థానాలకు పవన్ కేవలం 141 సీట్లలోనే తన వారిని నిలబెట్టారు. మిగిలిన వాటిని వేరేవారికి వదిలేశారు. దీనిని బట్టి పార్టీ నిర్మాణం ఎలా ఉందో తెలుస్తుంది. ఇక, ఇప్పుడు వీరు కూడా కనిపించడం లేదు. పోనీ ..వచ్చే ఎన్నికల నాటికి పార్టీనిర్మాణం పూర్తవుతుందని అనుకున్నా.. ఒక పార్టీని లేకుండా చేయడమే తన లక్ష్యమని ప్రజల మధ్యకు వెళ్తే.. ఎంత మంది పవన్కు అనుకూలంగా వ్యవహరిస్తారు? ఇది నియంతృత్వ పోకడ కాదా? అనేది ప్రశ్న. సో.. ఈ విధానం సరికాదనేది మేధావుల మాట.
This post was last modified on August 23, 2022 8:01 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…