Political News

అవ‌స‌ర‌మైతే.. శ‌తృవుల‌తోనూ క‌లుస్తాం

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తామ‌ని చెప్పారు.  విధ్వంస‌క‌ర పాల‌న‌ను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైతే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌తోనూ, శ‌తృవుల‌తోనూ క‌లుస్తామ‌ని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో అవ‌స‌రాన్ని బ‌ట్టి.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను బ‌ట్టి.. ఒక్కొక్క‌సారి శ‌తృవుల‌తోనూ క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనేదే తమ విధానమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతానని చెప్పారు. ఈ మేర‌కు తిరుపతి రామానుజపల్లి జీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

“రాష్ట్రంలో కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. వైసీపీకి, టీడీపీకి కొమ్ము కాసేందుకు మేం సిద్ధంగా లేం. సమాజంలో మార్పు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటాం. కులం అంటే పిచ్చి మమకారం నాకు లేదు. వైసీపీ నేతలు మంచి చేస్తున్నారో లేదో చెప్పాల్సింది మేం.. వాళ్లు కాదు. అందరూ చేతులు కట్టుకోవాలని కోరుకోవడమే ఆధిపత్య ధోరణి.“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాయలసీమలో దళితుల గొంతు నొక్కుతున్నారని  విమర్శించారు. కడప జిల్లాలో పరిశ్రమలు ఎందుకు రావటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాయలసీమ ప్రజల్లో చైతన్యం, మార్పు రావాలన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ ఎక్కువంటారు.. తనకెప్పుడూ అలా కనిపించలేదని చెప్పారు. పాలకులు సమస్యల పరిష్కారంపై, మౌలిక వసతులు, రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో గనులు, అటవీ సంపద దోపిడీ జరుగుతోందని విమర్శించారు. పంచాయతీలకు సక్రమంగా నిధులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ విధానాలకు ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, వేధింపులు పెరిగాయన్నారు.

This post was last modified on August 21, 2022 7:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో నోటికి పని చెప్పడం ఇకపై కుదరదు

నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…

3 minutes ago

డాక్టర్ నుంచి టెర్రరిస్ట్.. అసలు ఎవరీ తహావుర్ రాణా?

2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…

2 hours ago

అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్‌… వ్యభిచార కేసులో సంచలనం!

అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్‌పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్‌ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…

2 hours ago

ఎక్కి తొక్కిన ఘనటకు తోపుదుర్తే కారణమట!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…

3 hours ago

వీరమల్లు చుట్టూ సమస్యల సైన్యం

ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…

4 hours ago

ఐటీ అంటే చంద్ర‌బాబు.. యంగ్ ఇండియా అంటే నేను : రేవంత్ రెడ్డి

ముఖ్య‌మంత్రుల 'బ్రాండ్స్‌'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ముఖ్య‌మంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంద‌న్నారు. "రెండు…

4 hours ago