టాలీవుడ్ కు చెందిన ఏదో ఒక అంశంలో జీవితా రాజశేఖర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఆమె బీజేపీ తీర్థం తీసుకోవటం తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న ఆమె.. వైఎస్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించేవారు. ఆయన తరఫున మాట్లాడుతుండేవారు. రాజకీయంగా ఆయన నుంచి సాయం కోరినట్లు చెబుతారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత కాంగ్రెస్ తో ఆమె సంబంధాలు తగ్గాయని చెప్పాలి.
బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నఆమె.. తాజాగా టీ బీజేపీ రథసారధిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకున్న వేళ.. జీవితా రాజశేఖర్ సైతం బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కార్యక్రమాలకు హాజరుకానున్నట్లుఆమె చెప్పారు. అందుకే బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామయాత్రకు మద్దతు తెలిపేందుకు పాదయాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. బండి సంజయ్ ఎంతో సమర్థవంతమైన నాయకుడని.. ప్రజల్లోకి ఆయన వెళుతున్న తీరు అద్భుతమని తెగ పొగిడేశారు.
ఇద్దరు ఆడపిల్లల తల్లిగా మహిళల కష్టాలు తెలిసినదానిని అంటూ మాట్లాడిన జీవిత.. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పాలన ఎలా ఉందో అందరికి తెలుసు. ప్రజలెంతో కష్టపడుతున్నారు’’ సున్నిత విమర్శలు చేశారు. పార్టీ ఆదేశించాలే కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేసేందుకు తాను సిద్దమని పేర్కొన్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన జీవిత.. మరే నియోజకవర్గానికి గురి పెట్టారో చూడాలి. మరి.. ఆమె వినతికి బీజేపీ ఏ రీతిలో రియాక్టు అవుతుందో మరి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…