తొందరలోనే జరగుతుందని అనుకుంటున్న మునుగోడు ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం జనాలకు తాయిలాన్ని ప్రకటించింది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 10 లక్షలమందికి పెన్షన్లు మంజూరుచేసింది. ఉపఎన్నిక ముందు 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ డిసైడ్ చేసిందంటేనే అర్ధమైపోతోంది ఇది కేవలం ఉపఎన్నిక తాయిలమని. సరిగ్గా ఉపఎన్నిక ముందు ఇలాంటి తాయిలాలను ప్రభుత్వం ప్రకటిస్తే జనాలు ఓట్లేసేస్తారా ?
కొద్దినెలల క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో ఏమైందో అందరు చూసిందే. హూజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించాలన్న పట్టుదలతో ఎస్సీల కోసం దళితబంధు పథకాన్ని కేసీయార్ ప్రకటించారు. ఒక్కో లబ్దిదారుడికి రు. 10 లక్షలన్నారు. నియోజకవర్గంలోని సుమారు 23 వేలమంది ఎస్సీలకు లబ్ది దొరుకుతుందన్నారు. దరఖాస్తులు తీసుకుని కొందరికి డబ్బులు వేశారు కొందరికి వేయలేదు.
కొందరికేమో ఖాతాల్లో పడిన డబ్బులు కూడా తిరిగి వెనక్కు వెళ్ళిపోయాయి. ఇదే కాకుండా రోడ్లు వేశారు, పక్కా భవనాలు కట్టించారు, ఇళ్ళు కూడా నిర్మించారు. అడిగిన వారికి అడిగినట్లు డబ్బులు పంచారు. పథకాల్లో లబ్దిదారులందరికీ ఫలాలు అందేట్లు చూశారు. ఇంతచేసినా చివరకు టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే ఇంతకాలం ఎలాంటి పథకాలు అమలుచేయకుండా కేవలం ఉపఎన్నికలో గెలుపుకోసమే పథకాలను అమలుచేస్తే ఎందుకు అమలుచేస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు.
సేమ్ టు సేమ్ అదే పద్దతిలో ఇపుడు 10 లక్షల మందికి పెన్షన్ల మంజూరు కూడా. డెఫనెట్ గా ఈ 10 లక్షల్లో మునుగోడు జనాలు కూడా ఎక్కువగా ఉంటారనటంలో సందేహంలేదు. ఇంతకాలం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపకుండా, సంక్షేమపథకాలు అమలు చేయకుండా ఇపుడు పథకాలు, కార్యక్రమాలు ఎందుకు మొదలుపెడుతోందో జనాలకు తెలీదా ? ఇంత హడావుడిగా క్యాబినెట్ ఏర్పాటుచేసి లక్షలమందికి పెన్షన్లు మంజూరు చేయటంలోనే కేసీయార్ లో టెన్షన్ స్పష్టంగా కనబడుతోంది.
This post was last modified on August 12, 2022 7:20 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…