Political News

చైనాకు ఊహించని షాక్ ఇవ్వనున్న మోడీ?

తొందరలోనే డ్రాగన్ కు షాకివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈసారి ఇవ్వాలని అనుకుంటున్న షాక్ బడ్జెట్ మొబైల్ కంపెనీల విషయంలో అని సమాచారం. రు. 12 వేల లోపు ఖరీదున్న స్మార్ట్ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో చైనా కంపెనీలదే హవా. షావోమీ, వోప్పో, రెడ్ మీ కంపెనీలన్నీ చైనావన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో 12 వేల రూపాయల్లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో పై కంపెనీలదే సుమారు 80 శాతం మార్కెట్ ఉందంటే ఎవరు నమ్మరు.

ఒకపుడు ఇండియా కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్ కంపెనీల మొబైల్ ఫోన్ల బిజినెస్ బాగానే ఉండేది. ఎప్పుడైతే చైనా కంపెనీలు మనదేశంలోకి ఎంటరయ్యాయో అప్పటినుండే ఇండియన్ కంపెనీలు పడకేయటం మొదలుపెట్టాయి. చివరకు దేశంలోని మొబైల్ వ్యాపారాన్ని చైనా కంపెనీలు కమ్ముకునేయటంతో వేరేదారిలేక ఇండియా కంపెనీలు మూతపడిపోయాయి. ఈ విషయాలన్నింటినీ గమనించిన కేంద్ర ప్రభుత్వం స్వదేశీ కంపెనీలకు ప్రోత్సహం ఇచ్చే ఉద్దేశ్యంతో చైనా కంపెనీలపై బ్యాన్ విధించాలని ఆలోచిస్తున్నది.

ఒకవేళ కేంద్రం గనుక చైనా కంపెనీలపై బ్యాన్ విధిస్తే షావోమీ, రెడ్ మీ, ఒప్పో కంపెనీలు దాదాపు మూసేసుకోవాల్సిందే. రు. 12 వేలకు పైగా ధరలున్న మొబైల్ ఫోన్లను మాత్రమే ఇండియాలో అమ్ముకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో ఖరీదైన ఫోన్లు అమ్ముతున్న ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, లాంటి ఫోన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్ ప్లస్ కూడా చైనా కంపెనీయే అయినప్పటకి ఈ కంపెనీ నుండి బడ్జెట్ ఫోన్లులేవు అన్నీ ఖరీదైన ఫోన్లే.

ఇప్పటికే చైనాకు చెందిన రకరకాల 300 యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. దీనివల్ల డ్రాగన్ కు ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇపుడు మొబైల్ ఫోన్ల కంపెనీలను కూడా నిషేధిస్తే మరింత దెబ్బపడటం ఖాయం. ఇప్పటికే రెండు చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ఆదాయంపై పన్నులు కట్టకుండా చైనాకు తరలిస్తున్నట్లు నిర్ధారణైంది. ఇపుడు ఏకంగా కంపెనీలనే బ్యాన్ చేస్తే కనీసం స్వదేశీ కంపెనీలకు కాస్త ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

6 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

8 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

9 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

9 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

9 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

10 hours ago