Political News

చైనాకు ఊహించని షాక్ ఇవ్వనున్న మోడీ?

తొందరలోనే డ్రాగన్ కు షాకివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈసారి ఇవ్వాలని అనుకుంటున్న షాక్ బడ్జెట్ మొబైల్ కంపెనీల విషయంలో అని సమాచారం. రు. 12 వేల లోపు ఖరీదున్న స్మార్ట్ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో చైనా కంపెనీలదే హవా. షావోమీ, వోప్పో, రెడ్ మీ కంపెనీలన్నీ చైనావన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో 12 వేల రూపాయల్లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో పై కంపెనీలదే సుమారు 80 శాతం మార్కెట్ ఉందంటే ఎవరు నమ్మరు.

ఒకపుడు ఇండియా కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్ కంపెనీల మొబైల్ ఫోన్ల బిజినెస్ బాగానే ఉండేది. ఎప్పుడైతే చైనా కంపెనీలు మనదేశంలోకి ఎంటరయ్యాయో అప్పటినుండే ఇండియన్ కంపెనీలు పడకేయటం మొదలుపెట్టాయి. చివరకు దేశంలోని మొబైల్ వ్యాపారాన్ని చైనా కంపెనీలు కమ్ముకునేయటంతో వేరేదారిలేక ఇండియా కంపెనీలు మూతపడిపోయాయి. ఈ విషయాలన్నింటినీ గమనించిన కేంద్ర ప్రభుత్వం స్వదేశీ కంపెనీలకు ప్రోత్సహం ఇచ్చే ఉద్దేశ్యంతో చైనా కంపెనీలపై బ్యాన్ విధించాలని ఆలోచిస్తున్నది.

ఒకవేళ కేంద్రం గనుక చైనా కంపెనీలపై బ్యాన్ విధిస్తే షావోమీ, రెడ్ మీ, ఒప్పో కంపెనీలు దాదాపు మూసేసుకోవాల్సిందే. రు. 12 వేలకు పైగా ధరలున్న మొబైల్ ఫోన్లను మాత్రమే ఇండియాలో అమ్ముకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో ఖరీదైన ఫోన్లు అమ్ముతున్న ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, లాంటి ఫోన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్ ప్లస్ కూడా చైనా కంపెనీయే అయినప్పటకి ఈ కంపెనీ నుండి బడ్జెట్ ఫోన్లులేవు అన్నీ ఖరీదైన ఫోన్లే.

ఇప్పటికే చైనాకు చెందిన రకరకాల 300 యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. దీనివల్ల డ్రాగన్ కు ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇపుడు మొబైల్ ఫోన్ల కంపెనీలను కూడా నిషేధిస్తే మరింత దెబ్బపడటం ఖాయం. ఇప్పటికే రెండు చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ఆదాయంపై పన్నులు కట్టకుండా చైనాకు తరలిస్తున్నట్లు నిర్ధారణైంది. ఇపుడు ఏకంగా కంపెనీలనే బ్యాన్ చేస్తే కనీసం స్వదేశీ కంపెనీలకు కాస్త ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది.

This post was last modified on August 10, 2022 10:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ ప్రసంగంతో ఉప్పొంగిన చిరంజీవి!

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…

41 minutes ago

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

10 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

11 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

11 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

12 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

13 hours ago