Political News

చైనాకు ఊహించని షాక్ ఇవ్వనున్న మోడీ?

తొందరలోనే డ్రాగన్ కు షాకివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈసారి ఇవ్వాలని అనుకుంటున్న షాక్ బడ్జెట్ మొబైల్ కంపెనీల విషయంలో అని సమాచారం. రు. 12 వేల లోపు ఖరీదున్న స్మార్ట్ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో చైనా కంపెనీలదే హవా. షావోమీ, వోప్పో, రెడ్ మీ కంపెనీలన్నీ చైనావన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో 12 వేల రూపాయల్లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో పై కంపెనీలదే సుమారు 80 శాతం మార్కెట్ ఉందంటే ఎవరు నమ్మరు.

ఒకపుడు ఇండియా కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్ కంపెనీల మొబైల్ ఫోన్ల బిజినెస్ బాగానే ఉండేది. ఎప్పుడైతే చైనా కంపెనీలు మనదేశంలోకి ఎంటరయ్యాయో అప్పటినుండే ఇండియన్ కంపెనీలు పడకేయటం మొదలుపెట్టాయి. చివరకు దేశంలోని మొబైల్ వ్యాపారాన్ని చైనా కంపెనీలు కమ్ముకునేయటంతో వేరేదారిలేక ఇండియా కంపెనీలు మూతపడిపోయాయి. ఈ విషయాలన్నింటినీ గమనించిన కేంద్ర ప్రభుత్వం స్వదేశీ కంపెనీలకు ప్రోత్సహం ఇచ్చే ఉద్దేశ్యంతో చైనా కంపెనీలపై బ్యాన్ విధించాలని ఆలోచిస్తున్నది.

ఒకవేళ కేంద్రం గనుక చైనా కంపెనీలపై బ్యాన్ విధిస్తే షావోమీ, రెడ్ మీ, ఒప్పో కంపెనీలు దాదాపు మూసేసుకోవాల్సిందే. రు. 12 వేలకు పైగా ధరలున్న మొబైల్ ఫోన్లను మాత్రమే ఇండియాలో అమ్ముకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో ఖరీదైన ఫోన్లు అమ్ముతున్న ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, లాంటి ఫోన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్ ప్లస్ కూడా చైనా కంపెనీయే అయినప్పటకి ఈ కంపెనీ నుండి బడ్జెట్ ఫోన్లులేవు అన్నీ ఖరీదైన ఫోన్లే.

ఇప్పటికే చైనాకు చెందిన రకరకాల 300 యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. దీనివల్ల డ్రాగన్ కు ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇపుడు మొబైల్ ఫోన్ల కంపెనీలను కూడా నిషేధిస్తే మరింత దెబ్బపడటం ఖాయం. ఇప్పటికే రెండు చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ఆదాయంపై పన్నులు కట్టకుండా చైనాకు తరలిస్తున్నట్లు నిర్ధారణైంది. ఇపుడు ఏకంగా కంపెనీలనే బ్యాన్ చేస్తే కనీసం స్వదేశీ కంపెనీలకు కాస్త ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది.

This post was last modified on August 10, 2022 10:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

37 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

51 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago